ఓ ప్రణాళిక లేకుండా లాక్డౌన్ అమలు చేస్తుండడం వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆమె ఈ విధంగా అభిప్రాయపడ్డారు.
"కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 21 రోజుల పాటు లాక్డౌన్ విధించడం అవసరమే. కానీ ఓ ప్రణాళిక లేకుండా దీనిని అమలు చేయడం వల్ల ప్రజలు, ముఖ్యంగా లక్షలాది మంది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు."- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
మద్దతిస్తున్నాం.. కానీ
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల కలుగుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించారు. లాక్డౌన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని సోనియా స్పష్టం చేశారు. కానీ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ (ఆరోగ్య) సంక్షోభ సమయంలో పేదలకు ఆహారం, నీరు అందించి, అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
"మన దేశంలో కరోనా, లాక్డౌన్ పరిణామాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతోంది పేదలు, వెనుకబడి వర్గాలవారే. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా ఉంటూ, చేతనైన సాయం అందించాలి."- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
వైద్య సిబ్బందిని ఆదుకోండి