తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉన్నావ్'​ బాధితురాలి కుటుంబ సభ్యులకు బెదిరింపులు..! - 'ఉన్నావ్'​ బాధితురాలి కుటుంబ సభ్యులకు బెదిరింపులు..!

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలకి నిప్పుపెట్టిన మరుసటి రోజే ఆమె కుటుంబంపై బెదిరింపులకు పాల్పడ్డారు నిందితుల తరఫు వ్యక్తులు. భయంకర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఉన్నావ్​ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) ఏర్పాటు చేసిన అధికారులు.. బాధితురాలి కుటుంబ సభ్యులకు భద్రత ఏర్పాటు చేశారు.

Unnao rape
'ఉన్నావ్'​ బాధితురాలి కుటుంబ సభ్యులకు బెదిరింపులు..!

By

Published : Dec 6, 2019, 9:07 PM IST

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టి తీవ్రంగా గాయపరిచిన దుండగులు.. ఇప్పుడు ఆమె కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. భవిష్యత్​లో భయంకర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆమె బాబాయిని హెచ్చరించారు నిందితుల తరఫు వ్యక్తులు. శివం కుటుంబ సభ్యులు తన దుకాణం వద్దకు వచ్చి బెదిరించినట్లు తెలిపారు బాధితురాలి బాబాయి.

" నీ దుకాణాన్ని తగలబెడతాం. నిన్ను ప్రాణాలతో బతకనివ్వం అని బెదిరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నా. "

- బాధితురాలి బాబాయి.

భద్రత ఏర్పాటు..

బాధితురాలి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడిన సమాచారం అందినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ విక్రాంత్​ వీర్​. ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

దర్యాప్తునకు సిట్​..

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలికి నిప్పు పెట్టిన ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) ఏర్పాటు చేశారు అధికారులు. ఉన్నావ్​ ఏఎస్​పీ వినోద్​ పాండే నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం దర్యాప్తు చేపడుతుందని డివిజనల్​ కమిషనర్​ ముకేశ్​ మెశ్రామ్​ తెలిపారు. సిట్​ నివేదిక త్వరలోనే అందుతుందని.. ఆ తర్వాత ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వివరించారు.

జుడీషియల్​ కస్టడీకి నిందితులు..

బాధితురాలిపై దాడి చేసిన ఐదుగురు దుండగులను నేడు కోర్టులో హాజరుపరిచారు అధికారులు. అనంతరం 14 రోజుల జుడీషియల్​ కస్టడీలో భాగంగా ఉన్నావ్​ జైలుకు తరలించారు.

ఇదీ చూడండి: ఉల్లిపాయలు లేవని.. కాంగ్రెస్​ నేత వేలు కొరికిన యువకుడు!

ABOUT THE AUTHOR

...view details