తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ఎయిమ్స్​కు 'ఉన్నావ్'​ బాధితురాలు

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలిని దిల్లీ ఎయిమ్స్​కు తరలించారు యూపీ అధికారులు. మెరుగైన వైద్యం అందించేందుకు రాజధానికి తరలించాలన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

By

Published : Aug 6, 2019, 8:18 AM IST

దిల్లీ ఎయిమ్స్​కు 'ఉన్నావ్'​ బాధితురాలు

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. బాధితురాలిని ఎయిమ్స్‌కు తరలించి వైద్యం అందించాలని సుప్రీంకోర్టు సోమవారం యూపీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బాధితురాలిని హెలికాప్టర్‌లో ఎయిమ్స్‌కు తరలించారు.

మెరుగైన చికిత్స కోసం ఐసీయూకి తరలించారు. ఎయిమ్స్​ ప్రత్యేక వైద్యుల బృందం ఆమెకు చికిత్స చేస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితురాలికి ఇప్పటివరకు లఖ్‌నవూలో చికిత్స అందించారు. బాధితురాలిని దిల్లీకి తరలించేందుకు ఆమె తల్లి అంగీకరించినట్లు బాధితురాలి తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

అత్యంత జాగ్రత్తగా..

ప్రమాదంలో గాయపడిన కారణంగా ఎలాంటి కుదుపులు లేకుండా తరలించాలని వైద్యుల సూచించారు. ఈ మేరకు లఖ్​నవూ నుంచి హెలికాప్టర్​లో దిల్లీ ఎయిర్​పోర్టుకు చేర్చారు. అక్కడ నుంచి ఆసుపత్రికి 14 కిలోమీటర్ల దూరం అత్యంత జాగ్రత్తగా తరలించారు. ట్రాఫిక్​ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు దిల్లీ పోలీసులు.

అంబులెన్స్​లో బాధితురాలిని తరలిస్తున్న అధికారులు

కోర్టు ముందుకు నిందితుడు

ఉన్నావ్​ అత్యాచార కేసులో నిందితుడు కుల్​దీప్​ సింగ్​ సెం​గార్​ను దిల్లీలోని తిస్​ హజారీబాగ్​లోని ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో హైడ్రామా నెలకొంది. మీడియా ప్రతినిధులెవరినీ పోలీసులు అనుమతించలేదు.

సెంగార్​​తోపాటు అయన అనుచరుడు శశి సింగ్​ను ఉత్తర్​ప్రదేశ్​ నుంచి తీహాడ్​​ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి:'ఉన్నావ్'​ విచారణకు సుప్రీం 45 రోజుల గడువు

ABOUT THE AUTHOR

...view details