ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్లో ఓ యువకుడి కడుపులోంచి.. 35 ఇనుప మేకులు బయటపడ్డాయి.
శుక్లాగంజ్కు చెందిన కరణ్ గత కొద్దిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితమే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. సీటీ స్కాన్, ఎక్స్-రే , అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఫలితాలు చూసి నివ్వెరపోయారు.
కరణ్ కడుపులో ఇనుప కడ్డీలేవో ఉన్నాయని తెలుసుకున్న వైద్యులు.. వెంటనే శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేశారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి 5 అంగుళాల పొడవైన మేకులు, 4 అంగుళాల 35 ఇనుప కడ్డీలు, బయటకు తీశారు. ఈ ఇనుప సామాను సుమారు 250 గ్రాముల బరువు తూగుతుందని తెలిపారు. అయితే, ఈ ఇనుప కడ్డీలు , మేకులు అతడి కడుపులోకి ఎలా వెళ్లాయన్నది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: మూడు నెలల్లో అందుబాటులోకి ఆక్స్ఫర్డ్ టీకా!