తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​ రైతులను కలవనున్న కేంద్రమంత్రులు!

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​లో ​ రైతు నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి చర్చలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నవంబరు 13న ముగ్గురు కేంద్ర మంత్రులు అన్నదాతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. పంజాబ్​పై కేంద్రం వివక్ష చూపుతుందన్న ఆరోపణల మధ్య ఈ భేటీ కీలకం కానుంది.

By

Published : Nov 10, 2020, 5:48 AM IST

Union Ministers to meet agitating farmers of Punjab: Sources
నవంబరు 13న పంజాబ్​ రైతులను కలవనున్న కేంద్రమంత్రులు!

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​ రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ మంత్రి వర్గంలోని ముగ్గురు కేంద్రమంత్రులు.. నవంబరు 13న నిరసనలు చేస్తున్న పంజాబ్​ రైతులను కలువనున్నారు. వీరిలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​, రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​లు ఉన్నారు.

ఈ కార్యక్రమం రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ స్వగృహంలో జరగనుంది. పంజాబ్​లోని భాజపా కార్యకర్తలు, రైతులు ఇందులో పాల్గొననున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details