తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో ఎన్డీఏ ముఖ్యనేతల సమావేశం - MODI

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తథ్యమని ఎగ్జిట్​పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో.. ఆ కూటమి నేతలు భాజపా ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు, కూటమి నేతలు హాజరయ్యారు.​

దిల్లీలో ఎన్డీఏ కూటమి ముఖ్యనేతల సమావేశం

By

Published : May 21, 2019, 5:31 PM IST

దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఎన్డీఏ పక్షనేతలు సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం ఖాయమని ఎగ్జిట్​ పోల్స్​ వెల్లడించిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​షాతో పాటు కేంద్రమంత్రులు అరుణ్​జైట్లీ, సుష్మా స్వరాజ్​, నిర్మలా సీతారామన్​ తదితరులు హాజరయ్యారు.

సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, ఎగ్జిట్​ పోల్స్ ఫలితాలు.. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించనున్నట్లు సమాచారం.

ఈ సమావేశం అనంతరం హోటల్ అశోకాలో ఎన్డీఏ నేతలకు అమిత్​షా విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు నితీశ్​కుమార్​, ఉద్ధవ్​ ఠాక్రే, రామ్​విలాస్​ పాసవాన్​ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: విపక్షాల సమావేశానికి కర్ణాటక సీఎం డుమ్మా

ABOUT THE AUTHOR

...view details