తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాతో కేంద్రమంత్రి కన్నుమూత

By

Published : Sep 23, 2020, 9:17 PM IST

Updated : Sep 23, 2020, 10:04 PM IST

union minister suresh angadi passed away
కరోనాతో కేంద్రమంత్రి కన్నుమూత

21:28 September 23

కేంద్ర మంత్రి, భాజపా నేత సురేశ్​ అంగాడి కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సురేశ్​.. ప్రస్తుతం రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన కర్ణాటకలోని బెల్గాం స్థానం నుంచి లోక్​సభకు ఎన్నికయ్యారు. వరుసగా నాలుగుసార్లు(2004,09,14,19) పార్లమెంటుకు ఎంపికయ్యారు. 

సెప్టెంబర్​ 11న కరోనా సోకినట్లు ట్వీట్​ చేశారు సురేశ్​. 

ప్రముఖుల దిగ్భ్రాంతి..

మంత్రి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సురేశ్​ అంగడి అంకిత భావంతో పనిచేసే వ్యక్తి అని కొనియాడిన మోదీ.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

సురేశ్​ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు రాష్ట్రపతి. తన నియోజకవర్గ ప్రజల కోసం అవిరళ కృషి చేశారని కొనియాడారు. 

21:15 September 23

కరోనాతో కేంద్రమంత్రి కన్నుమూత

కేంద్ర మంత్రి సురేశ్​ అంగడి కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ మరణించారు. 

Last Updated : Sep 23, 2020, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details