రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో హర్షవర్ధన్ భేటీ
12:23 January 07
రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో హర్షవర్ధన్ సమావేశం
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో వచ్చే లోటుపాట్లు గుర్తించి, వాటిని అధిగమించేందుకు ఈ నెల 8న దేశవ్యాప్తంగా మరోసారి డ్రైరన్ నిర్వహించనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో రేపటి డ్రై రన్, వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, ముందస్తు జాగ్రత్తలు, ఇతర విషయాలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వర్చువల్గా సమావేశమయ్యారు.
వ్యాక్సిన్ పంపిణీలో రియల్ టైమ్ సమాచారం కోసం కో-విన్ యాప్ను కేంద్రం తీసుకొచ్చింది. మరికొద్దిరోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్న నేపథ్యంలో కో-విన్ యాప్లో పలు మార్పులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడం, సమాచారాన్ని యాప్లో ఎప్పటికప్పుడు పొందు పరచడం వంటి వాటిపై ప్రస్తుతం ప్రభుత్వం శిక్షణ కొనసాగిస్తోంది.