తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ నేతలు నన్ను చంపాలనుకుంటున్నారు' - terrorist

జైషే మహ్మద్​​ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ఐరాస ప్రకటన భారత్​కు అతిపెద్ద దౌత్య విజయమని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రపంచ వేదికగా భారత్​ చేసిన ప్రయత్నాలు ఫలించాయని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్​ ఇటార్సీ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్​పై నిప్పులు చెరిగారు ప్రధాని. కాంగ్రెస్​ నేతలు చంపాలని చూస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ.

'మసూద్​'పై నిర్ణయం భారత్​కు భారీ విజయం: మోదీ

By

Published : May 2, 2019, 6:08 AM IST

Updated : May 2, 2019, 7:26 AM IST

మసూద్​ అజార్​ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 'అంతర్జాతీయ తీవ్రవాది'గా గుర్తించటం సంతోషించదగిన విషయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో భారత్​కు ఇది భారీ దౌత్య విజయమని కొనియాడారు. ప్రపంచ వేదికపై భారత్​ ప్రయత్నాలు ఫలించాయని రాజస్థాన్​ జయపురలో నిర్వహించిన ఎన్నికల ప్రసంగంలో తెలిపారు ప్రధాని.

గత ప్రభుత్వ హయాంలో కనీసం ప్రధాని గొంతు​ వినబడని పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్​పై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు 130 కోట్ల మంది ప్రజల గొంతుక ఐరాస వేదికపై వినిపించిందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని మున్ముందు మరిన్ని జరుగుతాయని చెప్పారు.

'మసూద్​'పై నిర్ణయం భారత్​కు భారీ విజయం: మోదీ

" ఐక్యరాజ్య సమితి మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించటం సంతోషించదగిన విషయం. ఆలస్యమైనా మంచే జరిగింది. తీవ్రవాదంపై పోరులో, ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో చాలా కాలం నుంచి భారత్ గట్టి​ ప్రయత్నాలు చేస్తోంది. ఇది దేశానికి అతిపెద్ద దౌత్య విజయం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్​ చేస్తోన్న పోరాటానికి మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని.

ఇటార్సీ సభలో కాంగ్రెస్​పై విమర్శలు...

మధ్యప్రదేశ్​ ఇటార్సీ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్​పై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. వంశపారంపర్య పాలన, అవినీతిని వ్యాప్తి చేయటంలోనే హస్తం పార్టీ నేతలు నిజాయతీగా ఉన్నారని ఆరోపించారు. అభివృద్ధి పథకాలను నాశనం చేయటమే కాంగ్రెస్​ సంస్కృతి అని ఎద్దేవా చేశారు.

మధ్యప్రదేశ్​లో అధికార కాంగ్రెస్​ పార్టీ నీటిపారుదల పథకాలను వేగవంతం చేయకపోవటం వల్లనే రాష్ట్రంలో నీటి కొరత వచ్చిందని ఆరోపించారు మోదీ. భాజపా దేశాభివృద్ధికి పాటుపడుతుంటే కాంగ్రెస్​ మాత్రం వారి వంశంలోని కొత్త తరం సంక్షేమానికి కృషిచేస్తోందని ఆరోపించారు.

" కాంగ్రెస్​ పార్టీ నేతలు మీ మోదీపై ద్వేషాన్ని పెంచుకున్నారు. వారు మోదీని చంపాలని కూడా కలలు కంటున్నారు. కానీ మధ్యప్రదేశ్​ ప్రజలు, భారత ప్రజలు మోదీ కోసం పోరాటం చేస్తారని వారు మరిచిపోతున్నారు."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఇదీ చూడండి: అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస

Last Updated : May 2, 2019, 7:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details