తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విమానంలో ఒక్కరికి కరోనా- 19 మంది నిర్బంధం - అధికారుల అప్రమత్తతతో ఆగిన విమానం.. అదే కారణం!

కేరళ కొచ్చి విమానాశ్రయం నుంచి దుబాయ్​ వెళ్లవలసిన విమానం రన్​వేపై అకస్మాత్తుగా నిలిపేశారు అధికారులు. విమానంలోని 289మందిని కిందకు దింపారు. కరోనా పాజిటివ్​గా తేలిన వ్యక్తితో అనుబంధం ఉన్న వారిని నిర్బంధ కేంద్రానికి తరలించి మిగిలిన వారిని అదే విమానంలో దుబాయ్​కు పంపించేశారు.

UK national tests positive for coronavirus; All 289 passengers offloaded at Kochi airport
అధికారుల అప్రమత్తతతో ఆగిన విమానం.. అదే కారణం!

By

Published : Mar 15, 2020, 2:26 PM IST

Updated : Mar 15, 2020, 3:27 PM IST

కేరళలో కొచ్చి విమానాశ్రయంలో రన్​వేపై దుబాయ్​ బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న విమానాన్ని అకస్మాత్తుగా నిలిపివేశారు అధికారులు. విమానంలో కరోనా పాజిటివ్​గా తేలిన వ్యక్తి ఉన్న కారణంగా 289 మంది ప్రయాణికులను కిందకు దింపేశారు. వారిలో 19 మందిని మాత్రమే ప్రత్యేక శిబిరానికి తరలించి, మిగిలిన వారిని దుబాయ్​కు పంపించేశారు.

ఇదీ జరిగింది..

బ్రిటన్​కు చెందిన 19 మంది బృందం కేరళకు విహారయాత్ర కోసం వచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం వీరిని కేరళ మున్నార్​లోని రిసార్ట్​ నిర్బంధ కేంద్రంలో ఉంచారు అధికారులు. శనివారం రక్త నమూనాలను సేకరించి వైద్య పరీక్షలకు పంపారు. నేడు బయటపడిన ఫలితాల్లో వారిలోని ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. అయితే అధికారుల అనుమతి లేకుండానే వారు దుబాయ్​ వెళ్లే విమానాన్ని ఎక్కేశారు. బ్రిటన్ పర్యటకులు ప్రత్యేక శిబిరాన్ని వీడిన అంశాన్ని గుర్తించిన అధికారులు విమానాశ్రయ సిబ్బందిని సంప్రదించారు. దుబాయ్​కు బయల్దేరనున్న విమానంలో వారు ఉన్నట్లు తెలుసుకుని ఆపేసి.. ప్రత్యేక శిబిరానికి తరలించారు.

ఇదీ చూడండి:నిర్బంధ కేంద్రంలో ఎలాంటి సదుపాయాలుంటాయో తెలుసా?

Last Updated : Mar 15, 2020, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details