తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోమాతకు ఘనంగా సీమంతం - హోసబెళకు ఆశ్రమం

గోమాతను పూజించడం సాధారణంగా చూస్తుంటాం. అయితే కర్ణాటకకు చెందిన ఓ ఆశ్రమవాసులు.. ఏకంగా ఆవుకు సీమంతం చేశారు. ఆవుకు సీమంతమేంటని ఆశ్చర్యపోతున్నారు కదూ? మరి విశేషాలేంటో తెలుసుకోండి.

Udupi 'Hosa belaku' ashram have organize the seemantham for the cow
హోసబెళకు ఆశ్రమంలో గోమాతకు ఘనంగా సీమంతం!

By

Published : Jan 8, 2021, 1:30 PM IST

శునకాలకు పుట్టిన రోజులు చేయడం.. వాటికి కానుకలు ఇవ్వడం వంటివి ఇటీవల కర్ణాటక వార్తల్లో నిలిచాయి. అచ్చం అలాంటి ఘటనే ఉడుపిలో జరిగింది. ఓ ఆవుకు సీమంతం చేశారు హోసబెళ ఆశ్రమవాసులు. శేష జీవితాన్ని హాయిగా గడుపుతున్న కొంతమంది వృద్ధులు.. వారితోనే పాటు ఉన్న 'గౌరి' అనే గోవుకు ఘనంగా సీమంతం జరిపించారు.

గోమాతకు హారతి ఇస్తున్న ఆశ్రమ వాసులు

అచ్చం మనిషికి చేసినట్లే...

మనుషులకు జరిపినట్లే గోవుకు సీమంతం వేడుకలు చేశారు ఆశ్రమవాసులు. గౌరికి మంగళ స్నానం చేయించి.. అనంతరం దానిపై పచ్చని వస్త్రం(చీర) వేశారు. బొట్లు పెడుతూ.. దానికి నచ్చిన ఆహారాన్ని తినిపించారు. కొందరు హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించి, మూగజీవులపై వారి పెద్ద మనుసు చాటుకున్నారు.

ఆవుపై కొత్త వస్త్రం కప్పిన దృశ్యం
బొట్టు పెడుతున్న మహిళ
ఆవు సీమంతం కోసం తయారు చేసిన ఆహార పదార్థాలు
ప్రత్యేక పరికరం సాయంతో గౌరిని నడిపిస్తున్న ఆశ్రమ వాసులు

గాయాలతో..

20 రోజుల క్రితం మణిపాల్​ జిల్లా కార్యాలయం వద్ద తీవ్ర గాయాలతో ఉన్న ఆవును చూసి.. జిల్లా సిటిజన్​ కమిటికీ సమాచారం అందిచారు స్థానికులు. దీంతో హోసబెళకు ఆశ్రమంలో ఆవుకు రక్షణ, వసతి కల్పించారు అధికారులు. అప్పటి నుంచి ఆశ్రమ కన్వీనర్​ వినయచంద్ర.. గౌరి ఆలనపాలన చూసుకుంటున్నారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆవుకు.. నడిచేందుకు వీలుగా కృత్రిమ కాలును అమర్చారు. ఓ పరికరాన్ని కూడా రూపొందించి.. దాని సాయంతో నడిపిస్తున్నారు.

ఆవు నడవడానికి వీలుగా తయారు చేసిన యంత్రం

ఇదీ చూడండి:కుక్కకు బర్త్​ డే గిఫ్ట్​గా 250 గ్రాముల గోల్డ్​ చైన్

ABOUT THE AUTHOR

...view details