తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుతిన్​, జిన్​పింగ్​కు వచ్చిన అవార్డు ఇప్పుడు మోదీకీ... - india-UAE]

యూఏఈ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ జాయేద్‌'ను స్వీకరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ దేశ యువరాజు మహ్మద్​ బిన్​ జాయేద్​ అల్​ నహ్యాన్​ ఈ అవార్డును మోదీకి ప్రధానం చేశారు.

పుతిన్​, జిన్​పింగ్​కు వచ్చిన అవార్డు ఇప్పుడు మోదీకీ...

By

Published : Aug 24, 2019, 4:45 PM IST

Updated : Sep 28, 2019, 3:09 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ జాయేద్‌'ను స్వీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మోదీ కృషికి గాను.. యూఏఈ ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. యూఏఈ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్​ అల్‌ నహ్యాన్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు.
యూఏఈ వ్యవస్థాపకుడు షేక్ జాయేద్‌ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరు మీద ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌, క్వీన్ ఎలిజబెత్‌-2, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సహా మరికొందరు ప్రపంచనేతలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గత ఏప్రిల్‌లో దివంగత అల్‌ నహ్యాన్ జయంతి సందర్భంగా మోదీకి యూఏఈ సర్కారు ఈ అవార్డును ప్రకటించింది.

పుతిన్​, జిన్​పింగ్​కు వచ్చిన అవార్డు ఇప్పుడు మోదీకీ...

బంధాల బలోపేతంపై చర్చలు

భారత్​-యూఏఈ మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై యువరాజుతో చర్చలు జరిపారు మోదీ. తమ దేశాన్ని రెండోసారి సందర్శించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు మహ్మద్​ బిన్​ జాయేద్ అల్​ నహ్యాన్​.

" ఇరు దేశాల మధ్య స్నేహం మరింత దృఢమయ్యేలా మోదీ, యువరాజు మధ్య చర్చలు ఫలవంతంగా జరిగాయి. దైపాక్షిక బంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. "
-ప్రధాని కార్యాలయం ట్వీట్.

ఇదీ చూడండి: జైట్లీ మృతిపై మోదీ భావోద్వేగ సందేశం

Last Updated : Sep 28, 2019, 3:09 AM IST

ABOUT THE AUTHOR

...view details