తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2019, 5:46 AM IST

Updated : Dec 13, 2019, 10:13 AM IST

ETV Bharat / bharat

ఈ నెల 18న భారత్- అమెరికా మధ్య 2+2 చర్చలు

భారత్​ అమెరికా మధ్య రెండో 2+2 మంత్రుల ద్వైపాక్షిక చర్చలు డిసెంబర్ 18న జరగనున్నట్లు విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీశ్​ కుమార్​ తెలిపారు. ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు వాషింగ్టన్​​లో భేటీ కానున్నట్లు తెలిపారు.

Two-plus-two Indo-US dialogue to be held on Dec 18 in Washington: MEA
డిసెంబర్ 18న భారత్- అమెరికా మధ్య రెండో 2+2 చర్చలు

ఈ నెల 18న భారత్- అమెరికా మధ్య 2+2 చర్చలు

భారత్-అమెరికా మధ్య రెండో 2+2 ద్వైపాక్షిక చర్చలు డిసెంబర్ 18న వాషింగ్టన్​​లో జరగనున్నాయి. చర్చల్లో భాగంగా విదేశాంగ విధానంపై సమగ్ర సమీక్ష సహా భద్రతా, రక్షణ సంబంధాలపై ఇరుదేశాల నేతలు సమాలోచనలు జరపనున్నారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించనున్నారు.

భారత్ తరఫున విదేశీ వ్యవహారాల మంత్రి జయ్​శంకర్, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ పాల్గొననున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. అమెరికా ప్రతినిధులతో వీరిరువురు సమావేశం కానున్నట్లు తెలిపారు. అమెరికా తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ చర్చల్లో పాల్గొననున్నారు.

"ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ అమెరికా 2+2 మంత్రుల సమావేశం 2018 సెప్టెంబర్​లో ప్రారంభించాం. అప్పటినుంచి భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి. త్వరలో జరగనున్న సమావేశంలో ఇరుదేశాల మంత్రులు.. భద్రత, రక్షణ రంగాలు సహా విదేశాంగ విధానాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు."-రవీశ్ కుమార్, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతనిధి

ఇదీ చూడండి: హైవే పై ఉల్లి- ఎగబడి సంచులు నింపుకున్న జనం

Last Updated : Dec 13, 2019, 10:13 AM IST

ABOUT THE AUTHOR

...view details