దిగ్గజ విమాన సంస్థ స్పైస్జెట్లో ప్రయాణించిన ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో విమాన సిబ్బంది సహా బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరిలించినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది.
మే 25న ఎస్జీ-8194లో అహ్మదాబాద్ నుంచి దిల్లీ, ఎస్జీ-8152లో దిల్లీ నుంచి గువాహటికి వెళ్లిన ఇద్దరు ప్రయాణికుల్లో వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. అనంతరం.. వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. మే 27న వచ్చిన ఫలితాల్లో.. కరోనా పాజిటివ్ అని తేలినట్లు స్పైస్జెట్ విమాన సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే.. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, ప్రయాణికులకు మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ ఇస్తున్నామని చెప్పారు.