తెలంగాణ

telangana

By

Published : Jan 1, 2020, 9:41 AM IST

Updated : Jan 1, 2020, 10:30 AM IST

ETV Bharat / bharat

పాక్​ చొరబాటుదారుల దుశ్చర్య.. ఇద్దరు భారతీయ జవాన్లు మృతి

two-army-personnel-killed-in-gunfight-with-pakistani-infiltrators-along-loc-in-jammu-and-kashmirs-rajouri-district
కశ్మీర్​లో పాక్​ చొరబాటుదారుల వీరంగం.. ఇద్దరు జవాన్లు మృతి

10:27 January 01

జమ్ము కశ్మీర్ రాజౌరీ జిల్లాలో పాకిస్థాన్​కు చెందిన చొరబాటుదారులు రెచ్చిపోయారు. నౌషెరా సెక్టార్​లోని నియంత్రణ రేఖ వెంట భారత జవాన్లు తనిఖీలు నిర్వహిస్తుండగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్​లోకి చొరబడే సమయంలో చొరబాటుదారులను ఖైరీ త్రయాత్​ అడవిలో గుర్తించి సైనికులు నిలువరించినట్లు అధికారులు వెల్లడించారు.

"నౌషెరా సెక్టార్​లో జరిగిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్​లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి."- లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్, సైన్యం అధికార ప్రతినిధి

ఉగ్రవాద కదలికలు ఉన్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో చొరబాటుదారులు కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు.

09:47 January 01

జమ్ము కశ్మీర్​లో పాక్ చొరబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్​లో గాలింపు చర్యలు చేపడుతున్న భారత సైనికులపై భీకర కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.

ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

09:36 January 01

జమ్ముకశ్మీర్​ సరిహద్దులో పాక్​ చొరబాటుదారులు మరోమారు రెచ్చిపోయారు. భారత సైనికులపై కాల్పులతో విరుచుకుపడ్డారు. రాజౌరీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 

Last Updated : Jan 1, 2020, 10:30 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details