తెలంగాణ

telangana

By

Published : Aug 2, 2020, 12:42 PM IST

ETV Bharat / bharat

వావ్​ తనీషా.. రెండున్నరేళ్లకే రికార్డుల వేట

రెండున్నరేళ్ల వయస్సులోనే.. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లను చెప్పి ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది కర్ణాటకకు చెందిన తనీషా. అంతేకాకుండా ఎన్నో జీకే ప్రశ్నలకు చకచకా సమాధానాలు కూడా చెప్పేస్తోందీ చిన్నారి.

Two and Half-year-old girl Tanisha Enters the India book of Record
వావ్​ తనిష.. రెండున్నరేళ్లకే రికార్డుల వేట

రెండున్నరేళ్ల వయస్సులో పిల్లలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉంటారు. కనీసం అఆఇఈలు కూడా సరిగ్గా పలకడం రాని వయస్సది. కానీ కర్ణాటకకు చెందిన తనీషా.. రెండున్నరేళ్లకే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చకచకా చెప్పేస్తోంది. దీంతో ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది.

వావ్​ తనీషా.. రెండున్నరేళ్లకే రికార్డుల వేట

తల్లి సహాయంతో..

తనీషా తల్లి ఓ బ్యాంకు ఉద్యోగిని. తండ్రి కేపీటీసీఎల్​లో పనిచేస్తుంటారు. వీరు శివమొగ్గలో నివాసముంటున్నారు. భోజనం సమయంలో తనీషాకు జీకే నేర్పించేది ఆ తల్లి. అవన్నీ తనీషాకు ఇట్టే గుర్తుండిపోతాయి. అప్పటినుంచి ఎన్నో ప్రశ్నలకు చకచకా సమాధానాలు కూడా చెప్పేస్తోందా చిన్నారి.

తనీషా

ఆది, సోమ.. వంటి వారాల పేర్లతో మొదలైన తనీషా ప్రయాణం.. నెలలు, సంవత్సరాలు, దేశం, రాష్ట్రాలు-రాజధానుల వరకు చేరింది.

తల్లిదండ్రులతో తనీషా

తనీషాలోని ప్రతిభను గుర్తించిన తల్లి.. ఆమె తెలివితేటలను ప్రపంచానికి పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లను చెబుతున్న తనీషాను వీడియో తీసి ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​కు పంపించింది. రెండున్నరేళ్ల చిన్నారిలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​.. తనీషాకు సర్టిఫికెట్​ను అందించింది.

సర్టిఫికేట్​

ఇదీ చూడండి:-ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే ఒదిగిపోయింది!

ABOUT THE AUTHOR

...view details