తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓనమ్​ ప్రత్యేకం: ఈదకుండా కొలను దాటినవారే విజేత - ఓనమ్​ ప్రత్యేకం

ఓనమ్​ వేడుకల్లో నాలుగో రోజైన 'చతయ' సందర్భంగా 'వాదం వళి' పోటీలు నిర్వహిస్తారు కేరళ ప్రజలు. కొలను తాడుకు వేలాడుతూ దాటిన వారికి రూ.10వేలు బహుమతి ఇస్తారు.

ఈదకుండా కొలను దాటినవారే విజేత

By

Published : Sep 14, 2019, 4:57 PM IST

Updated : Sep 30, 2019, 2:30 PM IST

ఓనమ్​.. కేరళలో అత్యంత వైభవంగా జరిగే పండుగ. ఆచారాలతో పాటు సంప్రదాయ క్రీడలకు ఓనమ్​ ప్రత్యేకం. 10 రోజులకుపైగా జరుపుకొనే ఈ వేడుకల్లో ఒక్కో రోజు ఒక్కో రకం పోటీలు ఉంటాయి.

'టగ్​ ఆఫ్​ వార్​'.. మలయాళంలో 'వాదం వళి' లేదా 'వాదం తూంగాల్​' అంటారు. వాదం అంటే తాడు, తూంగాల్​ అంటే ఎక్కడం, పట్టుకోవటం. గ్రామాల్లో ఈ ఆటకు విశేష ఆదరణ ఉంటుంది. ఓనమ్​ నాలుగో రోజైన 'చతయ' సందర్భంగా కొల్లం జిల్లాలో ఈ పోటీలను ఘనంగా నిర్వహిస్తారు.

వాదం తూంగాల్​ ఓ సాహస క్రీడను తలపిస్తుంది. తాడు సాయంతో కొలను దాటినవారిని విజయం వరిస్తుంది.

ఈదకుండా కొలను దాటినవారే విజేత

రూ.10 వేలు బహుమతి

ఈ పోటీలో పాల్గొనే వారికి చెట్లు ఎక్కడం తెలియాలి. కర్రను ఎలా పట్టుకోవాలి, నీళ్లలో పడకుండా ఎలా తప్పించుకోవాలో అవగాహన ఉండాలి. ఇవే ఈ ఆటకు నిబంధనలు. ఇందులో గెలిచిన వ్యక్తికి రూ.10వేలు బహుమతి లభిస్తుంది.

ఈ పోటీల కోసం నెల రోజుల ముందునుంచే సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఇందులో పాల్గొనేందుకు వేర్వేరు జిల్లాల నుంచి వస్తుంటారు ఔత్సాహికులు.

ఇదీ చూడండి: ఓనమ్​ ప్రత్యేకం​: ప్రతీకార కథతో స్నేహపూర్వక కుస్తీ

Last Updated : Sep 30, 2019, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details