తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జాదవ్​ కేసులో సత్యం, న్యాయం నిరూపితమయ్యాయి'

కుల్​భూషణ్​ జాదవ్ ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించడంపై భారత ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో సత్యం, న్యాయం మరోమారు నిరూపితమయ్యాయని మోదీ వ్యాఖ్యానించారు.

By

Published : Jul 18, 2019, 5:27 AM IST

'జాదవ్​ కేసులో సత్యం, న్యాయం నిరూపితమయ్యాయి'

పాక్​ చెరలో ఉన్న భారత మాజీ నౌకాదళ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఇచ్చిన తీర్పుపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో సత్యం, న్యాయం నిరూపితమయ్యాయని ట్వీట్​ చేశారు.

"కుల్​భూషణ్ జాదవ్​కు న్యాయం చేకూర్చడానికి ప్రభుత్వం చేసిన కృషిని నేను అభినందిస్తున్నా. ఐసీజే తీర్పు జాదవ్​ కుటుంబ సభ్యులకు ఓదార్పునిస్తుందని, చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశిస్తున్నా."
-వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి

న్యాయం జరుగుతుంది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

"ఐసీజే తీర్పును మేము స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో సత్యం, న్యాయం నిరూపితమయ్యాయి. నిజానిజాలు పరిశీలించి వాటి ఆధారంగా తీర్పు ఇచ్చినందుకు ఐసీజేకు అభినందనలు."- నరేంద్రమోదీ, భారత ప్రధానమంత్రి

'జాదవ్​ కేసులో సత్యం, న్యాయం నిరూపితమయ్యాయి': మోదీ

'తమ ప్రభుత్వం ప్రతి భారతీయుడి భద్రత, సంక్షేమం కోసం పాటుపడుతుందని', మోదీ వ్యాఖ్యానించారు. కుల్​భూషణ్​ జాదవ్​కు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్ల ఆయన తెలిపారు.

ఇదీ జరిగింది..

భారత మాజీ నౌకాదళ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​పై గూఢచర్యం, ఉగ్రవాదం నేరాలు మోపి పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్​లో ఉరిశిక్షకు ఆదేశించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్​... ఐసీజేను ఆశ్రయించింది.

భారత్​ వాదనలు విన్న అంతర్జాతీయ న్యాయస్థానం అబ్దుల్కావి అహ్మద్​ యూసఫ్​ నేతృత్వంలోని అంతర్జాతీయ న్యాయస్థానం... కుల్​భూషణ్​ ఉరిశిక్ష నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఆయనకు వేసిన శిక్షను పునఃసమీక్షించాలని, పాకిస్థాన్​ను ఆదేశించింది. ఇది భారత్​కు అతిపెద్ద విజయం.

ఇదీ చూడండి: వైద్య కమిషన్​ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం​ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details