తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా విలయం: 4 రోజులుగా ట్రాఫిక్​ జామ్

మహారాష్ట్రను వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాలు నీటమునిగాయి. వాగులు, నదులు ఉప్పొంగి.. వంతెనలపై నుంచి ప్రవహిస్తున్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

By

Published : Aug 9, 2019, 11:30 AM IST

మహా విలయం: 4 రోజులుగా ట్రాఫిక్​ జామ్

మహా విలయం: 4 రోజులుగా ట్రాఫిక్​ జామ్
మహారాష్ట్రలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. సతారా, సాంగ్లి, కొల్హాపుర్​ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక అంతస్తు మేర ఎత్తులో నీరు నిలిచిపోయింది. రోడ్లు, వంతెనలపై నుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి.

నిలిచిన వాహనాలు..

కొల్హాపుర్​ జిల్లాలోని వర్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటం వల్ల నదీ పరివాహక గ్రామాలు నీటమునిగాయి. కరద్ సమీపంలో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సుమారు నాలుగు రోజుల నుంచి వరదల్లో చిక్కుకుపోయామని లారీ డ్రైవర్లు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఆగ్రా నుంచి ఆలుగడ్డలు తీసుకొస్తున్నాను. సరుకు ట్రక్​లో ఉండిపోయింది. నాలుగు రోజులుగా ఇక్కడే ఉన్నాం. హుగ్లీ వెళుతున్నాం. నది ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే తరలించకపోతే ఆలు పాడైపోతాయి. సరుకు పాడైతే సుమారు 4-5 లక్షల రూపాయలు నష్టం వస్తుంది."
- సురేష్​, ఆలుగడ్డ వ్యాపారి

సహాయ చర్యలు ముమ్మరం...

వరద ప్రభావం ఎక్కువగా ఉన్న సాంగ్లీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సహాయక చర్యల కోసం నావికాదళానికి చెందిన 12 బృందాలను అక్కడకు పంపుతున్నారు.


ఇదీ చూడండి: కేరళ: కుండపోత వర్షానికి చెరువులైన వీధులు

ABOUT THE AUTHOR

...view details