తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొండల్లో నివసిస్తాం.. క్రికెట్​ మైదానంలో సత్తా చాటుతాం!' - గిరిజన మహిళల క్రికెట్

కొండాకోనల్లో ఇళ్లు, పొలం తప్ప వేరే ప్రపంచం తెలియని మహిళలు.. ఇప్పుడు క్రికెట్​ మైదానంలో సత్తా చాటుతున్నారు. అవకాశం ఇవ్వాలే గానీ, పురుషులకు తీసిపోమని నిరూపించారు మధ్యప్రదేశ్​లోని గిరిజన మహిళలు. నిరక్షరాస్యులైనా.. క్రికెట్​ పరిభాషను ఒంటపట్టించుకుని ఔరా అనిపిస్తున్నారు.

TRIBAL WOMEN PLAYED CRICKET IN CULTURAL DRESS IN MANDLA madhyapradesh
'కొండల్లో నివసిస్తాం.. క్రికెట్​ మైదానంలో సత్తా చాటుతాం!'

By

Published : Dec 18, 2019, 6:32 AM IST

'కొండల్లో నివసిస్తాం.. క్రికెట్​ మైదానంలో సత్తా చాటుతాం!'

గ్రామీణ ప్రాంతాల్లో.. మహిళల చేతుల్లో అట్ల కాడ, చీపురు కట్ట వంటి ఇంటి సామాన్లు, పొలం పనిముట్లు మాత్రమే కనిపిస్తాయి. అవే కాకుండా.. అవకాశం ఇస్తే ఏం చేయగలరో నిరూపించారు మధ్యప్రదేశ్​ మండ్లాలోని గిరిజన మహిళలు. క్రికెట్ బ్యాట్​ చేతబట్టి మైదానంలో అదరగొడుతున్నారు. ఎలాంటి క్రికెట్​ వస్త్రధారణ లేకుండా సంప్రదాయ చీరల్లోనే రఫ్ఫాడిస్తున్నారు. సిక్స్​లు, ఫోర్​లు కొడుతూ ప్రశంసలు పొందుతున్నారు.

ఇది వికాసమే..

సర్వాంగిణ్​ మహిళా వికాస సమితి.. ఏటా పలు అభ్యుదయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా మహిళా క్రికెట్​ పోటీలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు వనితలు. క్రికెట్​ పరిభాషను పూర్తిగా అవగతం చేసుకుని తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.

మహిళలు వంటింటిని వదిలి, క్రికెట్​ మైదానంలోకి దిగి తమ సామర్థ్యాన్ని తెలుసుకోవాలనేదే ఈ క్రీడా పోటీల ముఖ్య ఉద్దేశం. అన్ని రంగాల్లోను రాణించగలమన్న ఆత్మవిశ్వాసంతో, తమని తాము సంరక్షించుకోవాలంటున్నారు మహిళా సంఘం సభ్యులు.

"2012 నుంచి ఈ క్రీడా పోటీలు పెడుతున్నాం. ఒకప్పుడు మహిళలు క్రికెట్​కు చాలా దూరంగా ఉండేవారు. కానీ నిర్భయ కేసు తర్వాత ఏటా ఈ మహిళా క్రికెట్​ పోటీలు పెట్టాలని నిర్ణయించాం. ఒక్కో సంఘంలో మహిళలను సంప్రదించాం. క్రికెట్​ పోటీల్లో పాల్గొంటారా? అని అడిగాం. అప్పుడు మహిళలంతా చాలా సంతోషించారు, ఎంతో ఉత్సాహపడ్డారు. ఎందుకంటే, ఇప్పటివరకు వారికి అలాంటి అవకాశం ఎవరూ ఇవ్వలేదు. అలా మా బృందం తయారైంది. మ్యాచ్​ ఉన్నప్పుడు పది రోజుల ముందు నుంచి వారితో సాధన చేయిస్తాం. "

-శశి పటేల్​, సర్వాంగిణ్​ మహిళా వికాస సమితి సభ్యురాలు

ఈ ఆదివాసీ క్రికెటర్​లకు వారి కుటుంబసభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. అందుకే వారు ఇక్కడి వరకు వచ్చి రాణించగలుగుతున్నారు.

ఇదీ చదవండి;'మోదీ ప్రభుత్వం ప్రజల గొంతునొక్కుతోంది'

ABOUT THE AUTHOR

...view details