తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' మద్దతు కోసం 3 కోట్ల కుటుంబాల వద్దకు భాజపా - సీఏఏపై ఇంటింటికీ భాజపా సమయం

పౌరసత్వ చట్టానికి మద్దతుగా భాజపా భారీ కార్యక్రమం నిర్వహించనుంది. పౌర చట్టంపై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు వారి ఇళ్లకు వెళ్లి వివరించాలని నిర్ణయించింది. జనవరి 5 నుంచి 10 రోజుల్లో 3 కోట్ల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్​నాథ్ సహా.. భాజపా కీలక నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Top BJP leaders to visit households on Jan 5 to mobilise support for CAA
సీఏఏకు మద్దతుగా 3 కోట్ల కుటుంబాలను కలవనున్న భాజపా నేతలు

By

Published : Jan 3, 2020, 4:34 PM IST

పౌరసత్వ చట్టానికి ప్రజల మద్దతు కూడగట్టడానికి భారతీయ జనతా పార్టీ భారీ కార్యక్రమం చేపట్టనుంది. జనవరి 5 నుంచి ఇంటింటికీ వెళ్లి పౌర చట్టంపై ప్రజల్లో అపోహలు తొలగించాలని నిర్ణయించింది. భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, భాజపా కీలక నేతలందరూ పాల్గొననున్నారు. 10 రోజుల్లో 3 కోట్ల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని దిల్లీలో హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. గాజియాబాద్​లో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, లఖ్​నవూలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, నాగ్​పుర్​లో నితిన్ గడ్కరీ, జైపుర్​లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ పాల్గొననున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా పౌరసత్వ అంశంపై ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు జైన్. పౌరసత్వ చట్టంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు జైన్​.

"ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీల కారణంగా ఏ ఒక్క భారతీయ ముస్లింకు ప్రమాదం ఉండదు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. వారందరి భయాందోళనలను రాజ్యాంగం సంరక్షిస్తుంది. భారత్​లో ఉన్న ఏకైక మతం రాజ్యాంగమే."
-అనిల్ జైన్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి: మహారాష్ట్రలో చక్రం తిప్పనున్న ఎన్సీపీ?

ABOUT THE AUTHOR

...view details