తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్రోహ పాక్​ డ్రోన్లపై భారత్​ వజ్రాయుధం..! - ఇజ్రాయిల్ డ్రోన్లు

డ్రోన్​లను వినియోగించి పాకిస్థాన్​... భారత్​లోకి అక్రమంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు పంపిస్తున్న వేళ... వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి భారత్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం స్వదేశీ, విదేశీ సాంకేతిక డ్రోన్​లను సమకూర్చుకోవాలని నిర్ణయించింది.

విద్రోహ డ్రోన్లపై భారత్​ వజ్రాయుధం..!

By

Published : Oct 16, 2019, 5:31 AM IST

ఆర్మీ కమాండర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సైన్యాధికారులు. స్వదేశీ, విదేశీ తయారీ రక్షణ ఉత్పత్తులు, డ్రోన్​లను పరిశీలించారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో సైన్యాధిపతి జనరల్ బిపిన్​ రావత్​ కూడా పాల్గొన్నారు.

పంజాబ్​లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి పాకిస్థాన్​ డ్రోన్​లను వినియోగిస్తోంది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని సైన్యం నిర్ణయించింది. ఇందుకోసం దేశ, విదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పలు కౌంటర్​ డ్రోన్​లను బిపిన్​ రావత్, కమాండర్స్​ పరిశీలించారు.

ఇజ్రాయెల్​ డ్రోన్​లు

అత్యంత ఎత్తైన ప్రదేశాలకు చేరుకోగలిగే సామర్థ్యం గల, శత్రు లక్ష్యాలను శోధించి, గుర్తించి, నాశనం చేయగల ఇజ్రాయెల్ తయారీ డ్రోన్​లనూ అధికారులు పరిశీలించారు.

పాక్​ దుస్సాహసం

గతవారం పంజాబ్​లోని ఫిరోజ్​పుర్​లోకి ఓ పాకిస్థానీ డ్రోన్ ప్రవేశించింది. ఈ పరిణామంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్​ఎఫ్​), పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్టోబర్​ 8, 9 తేదీల్లో పాక్ డ్రోన్లు హజారాసింగ్ వాలా, టెండివాలా గ్రామాల్లోకి ప్రవేశించాయి. ఈ విషయంపై మంగళవారం పాకిస్థాన్​ రేంజర్స్​తో జరిగిన ఫ్లాగ్​ మీటింగ్​లో బీఎస్​ఎఫ్ నిరసన వ్యక్తం చేసింది.

కొద్ది రోజుల క్రితం 2 పాక్ డ్రోన్​లను పంజాబ్​ పోలీసులు పట్టుకున్నారు. ఇవి జీపీఎస్​తో పనిచేస్తూ భూమికి 500 మీటర్ల ఎత్తులో ఎగురుతూ వచ్చాయి. వీటి ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న ఏకే-47 రైఫిల్స్, పిస్టల్స్, హ్యాండ్ గ్రనేడ్​లు, శాటిలైట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:నోట్లరద్దు, జీఎస్టీ కారణంగానే నిరుద్యోగం: రాహుల్

ABOUT THE AUTHOR

...view details