తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో మళ్లీ లాక్​డౌన్​.. 277 మంది మిస్సింగ్​

తమిళనాడులో కరోనాను కట్టడి చేసేందుకు చెన్నై సహా 4 జిల్లాల్లో శుక్రవారం నుంచి 12 రోజుల పాటు లాక్​డౌన్ అమలు చేయనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేల మార్కు దాటిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు చెన్నైలో 277 మంది కొవిడ్​ రోగుల ఆచూకీ లభించకపోవడం కలకలం రేపుతోంది.

By

Published : Jun 18, 2020, 7:42 PM IST

TN's reintroduction of intense lockdown in the metro, is it a model?
రేపటి నుంచే లాక్​డౌన్​.. 277 మంది కొవిడ్​ రోగులు మిస్సింగ్​

తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటింది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2174 కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉన్న చెన్నై, దాని చుట్టుపక్కల జిల్లాలు తిరవళ్లూర్​, చెంగల్​పేట్, కాంచీపురంలో శుక్రవారం నుంచి 12 రోజుల పాటు పూర్తిస్థాయిలో లాక్​డౌన్​ను అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే దాదాపు 70 శాతానికిపైగా కేసులు నమోదవుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది.

277 మంది రోగులు మిస్సింగ్​..

రేపటి నుంచి లాక్​డౌన్ అమల్లోకి రానున్న తరుణంలో చెన్నైలో 277 మంది కరోనా రోగులు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. వీరిని ట్రేస్​ చేసేందుకు అధికారులు ప్రయత్నించినా ఎలాంటి పురోగతి లేదు. వీరిలో కొందరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారు కాగా.. మరికొందరు తప్పుడు వివరాలు ఇచ్చిన కారణంగా గుర్తించడం కష్టమవుతోంది

తమిళనాడులో ఇప్పటివరకు 50 వేల 193 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 576 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నై ప్రాంతంలోనే 35 వేల మందికిపైగా బాధితులున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి 10 లక్షల మందికి 9 వేల 845 పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంద శాతానికి 6.4 శాతం మందికి పాజిటివ్​గా తేలుతోంది.

లాక్​డౌన్​ వివరాలు...

చెన్నై, తిరవళ్లూర్​, చెంగల్​పేట్, కాంచీపురం జిల్లాల్లో 12 రోజులు లాక్​డౌన్​ అమల్లో ఉంటుంది. ఆ ప్రాంతాల్లో నిత్యవసర సేవలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఉంటుంది. జూన్ 21, 28 రెండు ఆదివారాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా పూర్తిస్థాయి లాక్​డౌన్ విధిస్తారు.

  • దుకాణాలు మూసివేయాలి.
  • కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల విక్రయాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే అనుమతి.
  • అత్యవసరం అయితేనే ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి.
  • హోటళ్లు, రెస్టారెంట్లకు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి. పార్సిల్ సుదుపాయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • ఫుడ్​ డెలివరీ సంస్థలకు అనుమతి.
  • చెన్నై దాటి వెళ్లాలంటే ఈ-పాస్ తప్పనిసరి. వివాహ వేడుకలు, అంత్యక్రియలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితికి సంబంధించి సరైన పత్రాలు ఉంటేనే అనుమతి.
  • రైలు, విమాన సేవలు యాథావిధిగా కొనసాగుతాయి.
  • జూన్​ 21, 28 ఈ రెండు ఆదివారాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమల్లో ఉంటుంది. నిత్యావసర, అత్యవసర సేవలకే అనుమతి.
  • కంటైన్​మెంట్​​ జోన్లలో లేని 33 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరుకావాలి.
  • కంటైన్​మెంట్ జోన్లకు ఎలాంటి సడలింపులు లేవు.
  • లాక్​డౌన్​లో టీ షాపులు తెరిచేందుకు అనుమతి లేదు.
  • అమ్మ క్యాంటీన్లు తెరిచే ఉంటాయి.
  • నిర్మాణ పనులు కొనసాగించవచ్చు. పని ప్రదేశంలోనే కార్మికులకు ఆశ్రయం కల్పించాలి. వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలి.
  • బ్యాంకులు, కోర్టులు, మీడియా సంస్థలు కార్యకలాపాలు కొనసాగించవచ్చు.

ఇదీ చూడండి: మరుగుదొడ్డిలో ఏడు రోజులు క్వారంటైన్​!

ABOUT THE AUTHOR

...view details