తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2020, 8:07 PM IST

ETV Bharat / bharat

తమిళనాడు, కర్ణాటకలో కరోనా విజృంభణ

కరోనా మహమ్మారి దేశంలో అంతకంతకూ విజృంభిస్తోంది. ఇవాళ తమిళనాడులో రికార్డు స్థాయిలో 4,538 కేసులు నమోదయ్యాయి. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్, కర్ణాటక​లోనూ బాధితులు పెరుగుతున్నారు.

TN records 79 COVID-19 deaths, 4,538 fresh cases
తమిళనాడులో ఒక్కరోజే 4,538 మందికి కరోనా

దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదుకావటం ఆందోళన కలిగిస్తోంది.

తమిళనాడులో రికార్డు స్థాయిలో కేసులు

తమిళనాడులో రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 4,538 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 79 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2,315కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 60వేల 907 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 47,782 మంది చికిత్స పొందుతున్నారు.

  • కర్ణాటకలోనూ పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం మరో 3,693 మంది కొవిడ్​ బారినపడ్డారు. రాష్ట్రంలో ఒక్కరోజే 115 మరణాలు నమోదయ్యాయి.
  • ఉత్తరప్రదేశ్​లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 1,919 కేసులు నమోదవ్వగా... మొత్తం బాధితుల సంఖ్య 45,363కి చేరింది. వెయ్యి మందికి పైగా మరణించారు.
  • దిల్లీలో 1462 కేసులు, 26 మరణాలు నమోదయ్యాయి.
  • కేరళలో కొత్తగా 791 మందికి కరోనా సోకింది. మొత్తం కేసులు 10 వేల మార్కును దాటాయి.

ఇదీ చూడండి:ఆ 'గోల్డ్​ మ్యాన్'​ మాస్క్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details