40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని ప్రధాని నరేంద్రమోదీ సంచలన ప్రకటన చేశారు. బంగాల్లో భాజపా అధికారంలోకి వస్తే టీఎంసీ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.
బంగాల్లోని శ్రీరాంపుర్లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు మోదీ. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి.. పదుల సంఖ్యలో ఎంపీలతో దిల్లీ పీఠం ఎక్కాలని ఆశపడుతున్నారని ఎద్దేవా చేశారు.
"దీదీ.. మీ కింద భూమి కదిలిపోతోంది. చూడండి.. 23న ఫలితాలు రాబోతున్నాయి. అన్ని వైపుల నుంచి కమలం చుట్టుముడుతుంది. ఎమ్మెల్యేలు కూడా మీ దగ్గర నుంచి పారిపోతారు. ఇప్పటికే 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. దీదీ.. దిల్లీ చాలా దూరంలో ఉంది. ఈ విషయం దీదీకి కూడా తెలుసు. అసలు విషయమేమిటంటే... దిల్లీలో తాను, బంగాల్లో అల్లుడు ఉండాలన్నదే ఆమె ప్రణాళిక."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
మమత మేనల్లుడు, డైమండ్ హార్బర్ నియోజకవర్గ అభ్యర్థి అభిషేక్ను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.