తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో హింసకు మమతే కారణం: అమిత్​ షా

కోల్​కతాలో మంగళవారం జరిగిన హింసకు తృణమూల్​ కాంగ్రెస్సే కారణమని భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ఆరోపించారు. భాజపానే ఘర్షణకు కారణమన్న మమత వ్యాఖ్యలను తిప్పికొట్టారు. బంగాల్​లో ఎన్నికల సంఘం మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తోందని ధ్వజమెత్తారు.

By

Published : May 15, 2019, 1:05 PM IST

బంగాల్​లో హింసకు మమతే కారణం: అమిత్​ షా

బంగాల్​లో హింసకు తృణమూల్ కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షా. మంగళవారం కోల్​కతాలో రోడ్​ షో నిర్వహిస్తుండగా జరిగిన ఘర్షణలో సీఆర్​పీఎఫ్​ రక్షణ లేకపోయి ఉంటే తాను గాయాల పాలయ్యేవాడినని అన్నారు. ఆ ఘటనపై దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు షా.

సానుభూతి కోసం టీఎంసీ కార్యకర్తలే ఈశ్వర్​ చంద్ర విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు అమిత్​ షా. బంగాల్​లో ఎన్నికల సంఘం తృణమూల్​ పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తూ, ప్రేక్షక పాత్ర పోషిస్తోందని విమర్శించారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న అమిత్ షా

"ఆరు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. దేశంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదు. బంగాల్​లో తప్ప. టీఎంసీ బంగాల్​లోని 42 లోక్​సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. భాజపా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బరిలో ఉంది. ఎక్కడా హింస జరగలేదు. ఆరు విడతల్లోనూ బంగాల్​లో ఘర్షణలు జరిగాయి. దీన్ని గమనిస్తే నిన్న జరిగిన హింసకు తృణమూల్​ పార్టీనే కారణమని స్పష్టమవుతోంది. భాజపా కాదు. "
-అమిత్ షా, భాజపా అధ్యక్షుడు


ఇదీ చూడండి: ఈ కాశీవాసిని దీవించండి: నరేంద్ర మోదీ

ABOUT THE AUTHOR

...view details