తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపటి వరకు యోగముద్రలోనే 'మోదీ బాబా'

ఎన్నికల ప్రచార పర్వం ముగియగానే ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయారు మోదీ. ఉత్తరాఖండ్​లోని పవిత్రస్థలం కేదార్​నాథ్​ను దర్శించుకున్నారు. అనంతరం రుద్రగుహకు వెళ్లిన ప్రధాని.. యోగ ముద్రలో ధ్యానం చేస్తున్నారు.

By

Published : May 18, 2019, 5:17 PM IST

మోదీ

కేదార్​నాథ్​లో ప్రధాని మోదీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా దాదాపు 2 నెలలు తీరికలేకుండా గడిపిన ప్రధాని నరేంద్రమోదీ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథ్​ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయ సమీపంలోని పవిత్ర రుద్ర గుహకు చేరుకునేందుకు రెండు కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్​ చేశారు. మార్గమధ్యలో యాత్రికులకు అభివాదం చేశారు.

రుద్ర గుహలో కొన్ని గంటలపాటు యోగ ముద్రలో గడపనున్నారు మోదీ. రేపు ఉదయం వరకు అదే స్థితిలో ఉంటారని సమాచారం. గుహలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. ధ్యానం ఆరంభంలో కొన్ని దృశ్యాలు చిత్రీకరించేందుకు అంగీకరించారు.

కేదార్​నాథ్​ పర్యటన తర్వాత మోదీ బద్రీనాథ్​ యాత్రకు వెళ్తారు.

ఇదీ చూడండి: నిర్ణయాత్మక విడత- ప్రముఖులకు పరీక్ష

ABOUT THE AUTHOR

...view details