తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ దోషులకు తిహార్​​ జైలు అధికారుల నోటీసులు - Tihar jail officials issues notice to Nirbhaya Convicts for mercy petition

నిర్భయ కేసు నిందితులకు తిహార్​​ జైలు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఉరిశిక్షపై వారం రోజుల్లోగా క్షమాభిక్ష పిటిషన్​ దాఖలు చేసుకోవాలని సూచించారు. లేదంటే తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

Tihar jail officials issues notice to Nirbhaya Convicts for mercy petition
నిర్భయ దోషులకు తిహాడ్​ జైలు అధికారుల నోటీసులు

By

Published : Dec 19, 2019, 5:39 AM IST

Updated : Dec 19, 2019, 7:10 AM IST

నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషులు వారం రోజుల్లోగా క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని తిహార్​ జైలు పాలన విభాగం సూచించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు తిహార్​​ కారాగారం డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయెల్‌ తెలిపారు. ఈ గడువులోపు క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకోకపోతే తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు.

'ఉరి'పై జనవరి 7కు వాయిదా

అంతకుముందు ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయటంపై తీర్పును దిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టు జనవరి 7కు వాయిదా వేసింది. మరణశిక్ష అమలుకు ముందు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు ఇచ్చింది. ఈ మేరకు క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని తిహార్​ జైలు అధికారులు దోషులకు సూచించారు.

Last Updated : Dec 19, 2019, 7:10 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details