తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ అడవిలో పులి, చిరుతల మృతదేహాలు లభ్యం

మహారాష్ట్ర చంద్రాపుర్​ అడవిలో జాతీయ జంతువు పులి, చిరుత మృతదేహాలు లభ్యమైనట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

By

Published : Jun 10, 2020, 6:12 PM IST

Tiger, leopard found dead in Chandrapur forest in Maharastra
ఆ అడవిలో పులి, చిరుతల మృతదేహాలు లభ్యం

మహారాష్ట్ర చంద్రాపుర్​లో రెండు అడవి జంతువుల మృతదేహాలు అటవీశాఖ అధికారులకు లభ్యమయ్యాయి. అందులో ఒకటి పులి కాగా, రెండోది చిరుత.

సీతారామ్​పేట్​- మొహార్లీలోని 'తబోడా అంధారీ టైగర్​ రిజర్వ్​(టీఏటీఆర్​)' అడవి పరిధిలో పులి మృత దేహం లభ్యమైనట్లు అటవీ చీఫ్​ కన్జర్వేటర్​ ఎన్​.ఆర్​ ప్రవీణ్​ తెలిపారు. కుళ్లిపోయిన పులి కళేబరాన్ని చూసి.. అది నాలుగురోజుల క్రితం మరణించినట్లు భావించారు అధికారులు.

చంద్రాపుర్​- సవోలీ అటవీ ప్రాంతంలో చిరుత మృతదేహం లభ్యమైంది. అయితే అడవి పందులకోసం వేసిన వల ఉచ్చులో అది చిక్కుకుని చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:టీవీ చూడొద్దని మందలిస్తే.. ఉరేసుకున్నాడు!

ABOUT THE AUTHOR

...view details