తెలంగాణ

telangana

కాలి బూడిదైన బస్సు.. ముగ్గురు సజీవ దహనం!

By

Published : Jan 4, 2020, 8:55 AM IST

Updated : Jan 4, 2020, 11:37 AM IST

కర్ణాటక తుమకూరులో ఓ ప్రైవేటు బస్సు, ఓమ్ని వ్యాను కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Three people burnt alive in Bus and van accident near gubbi, tumakuru, karnataka
కాలి బూడిదైన బస్సు.. ముగ్గురు సజీవ దహనం!

కాలి బూడిదైన బస్సు.. ముగ్గురు సజీవ దహనం!

కర్ణాటక తుమకూరు​లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గుబ్బి తాలూకా దొబ్బగుని సమీపంలో.. 206 జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు, ఓమ్ని వ్యాను ఢీకొన్నాయి. మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.

బెంగళూరు నుంచి శివమొగ్గకు ప్రయాణిస్తున్న బస్సు తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. నరసమ్మ అనే వృద్ధురాలు సహా 55 ఏళ్ల వయసున్న వసంతకుమార్, రామయ్య అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:మగ పులి దాడిలో 'దామిని'కి గాయాలు.. మృతి

Last Updated : Jan 4, 2020, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details