తెలంగాణ

telangana

భారత్​ - పాక్​ ఉద్రిక్తతలను జయించిన 'వైశాఖీ'

By

Published : Apr 14, 2019, 10:04 PM IST

Updated : Apr 14, 2019, 11:11 PM IST

వైశాఖీ పర్వదినాన వేల మంది సిక్కులు పాకిస్థాన్​లోని గురుద్వారాలకు పయనమయ్యారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ వైశాఖీని జరుపునేందుకు పాక్​కు అధిక సంఖ్యలో వెళ్లారు భారతీయులు.

వైశాఖీ

పాకిస్థాన్​ గురుద్వారాలో వైశాఖీ

వైశాఖీ.. సిక్కుల నూతన సంవత్సరాది. ఏటా ఈ రోజున గురుద్వారాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు సిక్కులు. కొన్ని ప్రముఖ గురుద్వారాలు విభజన సమయంలో పాక్​ భూభాగంలోనే ఉండిపోయాయి. ఇరు దేశాల మధ్య ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా అక్కడికి వెళ్లే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

పాకిస్థాన్​లోని పంజాబ్​ రాష్ట్రం హసన్​ అబ్దల్​ పట్టణంలో ఉన్న గురుద్వారాలో వైశాఖీని వైభవంగా నిర్వహిస్తారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10వేల మంది సిక్కులు ఆ పట్టణానికి చేరుకున్నారు. ఇస్లామాబాద్​కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది హసన్​ అబ్దల్​.

సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్​ చేతి ముద్ర కలిగిన రాయి ఇక్కడ ఉంది. స్నానాలు ఆచరించి పవిత్రంగా భావించే ఈ రాయిని తాకి పరవశించిపోతారు సిక్కులు. మొత్తంగా పాక్​లో ఎనిమిది రోజులపాటు పర్యటిస్తారు. ఆ దేశంలోని అన్ని ఆలయాలను దర్శించి తిరుగు పయనమవుతారు.

వైశాఖీ పర్వదినం

సిక్కుల ఆరాధ్యుడు గురు గోవింద్ సింగ్ బోధనలు చేసిన ఈ రోజును వైశాఖీగా జరుపుకుంటారు. సిక్కులు కొన్ని నిబంధనలను పాటించాలని 1699లో ఇదే రోజు ప్రతిపాదించారు గురు గోవింద్. అందరి పేర్లకు చివర సింగ్​ అనే పదాన్ని చేర్చుకోవాలని సూచించారు. జుట్టు, గడ్డం కత్తిరించకూడదని చెప్పారు. అప్పటి నుంచి ఈ రోజును నూతన సంవత్సరాదిగా సిక్కులు జరుపుకుంటున్నారు.

ఇదీ చూడండి: వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

Last Updated : Apr 14, 2019, 11:11 PM IST

ABOUT THE AUTHOR

...view details