తెలంగాణ

telangana

By

Published : Nov 20, 2019, 4:26 PM IST

ETV Bharat / bharat

'అసద్'​పై మరోసారి బంగాల్​ సీఎం మాటలదాడి

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఏఐఎమ్​ఐఎమ్​ అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోసారి మజ్లిస్​ నేతలను ఉద్దేశించి మమతా ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర నేతలు మాత్రమే బంగాల్​ ప్రజల కోసం పోరాడుతారని వ్యాఖ్యానించారు.

'అసద్'​పై మరోసారి బంగాల్​ సీఎం మాటలదాడి

మజ్లిస్​ పార్టీపై పశ్చిమ్​ బంగ​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్​ నుంచి డబ్బుల సంచులతో వస్తున్న కొంతమంది నేతలు తాము ముస్లిం సానుభూతిపరులమంటూ చెప్పుకుంటున్నారని మమత వ్యాఖ్యానించారు. కానీ వారు భాజపాకు అతిపెద్ద మిత్రపక్షమని...మజ్లిస్​ నేతలను ఉద్దేశించి మమతా బెనర్జీ ఘాటు విమర్శలు చేశారు.

బయట నుంచి వచ్చిన నేతలను నమ్మవద్దని రాష్ట్ర నేతలపైనే నమ్మకం ఉంచాలని సాగర్​ దిఘిలో జరిగిన బహిరంగ సభలో ముస్లింలను మమతా బెనర్జీ కోరారు. రాష్ట్ర నేతలు మాత్రమే బెంగాల్​ ప్రజల కోసం పోరాడుతారని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:దీదీ X ఓవైసీ: 'మైనార్టీ తీవ్రవాదం'పై మాటల తూటాలు

ABOUT THE AUTHOR

...view details