తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సార్వత్రిక' మూడో దశలో 64.66% ఓటింగ్ - పోలింగ్​

పశ్చిమబంగాలో ఘర్షణలు మినహా మూడో విడత పోలింగ్​ ప్రశాంతంగా జరిగింది. ఈవీఎం మొరాయింపు సమస్య ఈ రోజూ కొనసాగింది. మూడో దశ పోలింగ్​లో 64.66 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.

భారత్​ భేరి: మూడో దశ పోలింగ్​ సమాప్తం

By

Published : Apr 23, 2019, 5:45 PM IST

Updated : Apr 23, 2019, 9:29 PM IST

భారత్​ భేరి: మూడో దశ పోలింగ్​ సమాప్తం

సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్​ స్వల్ప ఉద్రిక్తతల మధ్య ప్రశాంతంగా జరిగింది. ఈవీఎంల సమస్య మళ్లీ పునరావృతమైంది. బిహార్​, కేరళలో ఉదయం ఎలక్ట్రానిక్ ఓటింగ్​ యంత్రాలు మొరాయించాయి. అధికారులు వెంటనే సమస్య పరిష్కరించారు.

మూడో విడత పోలింగ్​లో 64.66 శాతం ఓటింగ్​ నమోదైంది. క్యూలైన్లో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించింది ఈసీ. పూర్తి పోలింగ్​ శాతంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఆయా రాష్ట్రాల్లో పోలింగ్​ శాతం

  • అసోం: 71.47 %
  • బిహార్​: 54.91 %
  • గోవా: 70.90 %
  • గుజరాత్​: 58.96 %
  • జమ్ము కశ్మీర్​: 13.61 %
  • కర్ణాటక: 60.42 %
  • కేరళ: 70.28 %
  • మహారాష్ట్ర: 57.01 %
  • ఒడిశా: 61.00 %
  • త్రిపుర: 77.28 %
  • ఉత్తరప్రదేశ్​: 56.71%
  • బంగాల్​: 78.97 %
  • ఛత్తీస్​గఢ్​: 64.68%
  • దాద్రా అండ్​ నాగర్​ హవేలి: 71.43%
  • దమణ్ దీవ్​​: 65.34 %

ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు..

దేశవ్యాప్తంగా ఓటింగ్​​ ప్రారంభం కావడానికి ముందే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అక్కడక్కడ ఘర్షణలు..

బంగాల్​ ముర్షీదాబాద్​ బాలిగ్రామ్ పోలింగ్​ బూత్​లో కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​ కార్యకర్తలు గొడవపడ్డారు. ఓటేయటానికి క్యూలైన్లో ఉన్న ఓ వ్యక్తి మరణించారు.

దక్షిణ్​ దినాజ్​పూర్ జిల్లా బునియద్​పూర్​లో ఓ పోలింగ్​ ఏజెంట్​ తన ఇంటి వద్ద విగత జీవిగా పడి ఉన్నారు. ముర్షీదాబాద్​ రాణిగంజ్​ ప్రాంతంలో రెండు పోలింగ్​ కేంద్రాల వద్ద గుర్తుతెలియని వ్యక్తి బాంబు విసిరాడు.

కేరళలో ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న ఇద్దరు వృద్ధులు హఠాత్తుగా కుప్పకూలి మరణించారు. మరో వ్యక్తి ఓటు వేసి ఇంటికి చేరుకున్న తర్వాత కన్నుమూశాడు.

ఓటేసిన ప్రముఖులు...

ఈ విడతలో ప్రముఖ నేతలు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​షా గుజరాత్​లో ఓటేశారు. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, కాంగ్రెస్​ నేతలు శశిథరూర్​, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మలయాళ ప్రముఖ నటులు మోహన్​ లాల్​, మమ్ముట్టిలు ఓటేశారు. క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్​​ కూడా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'తీవ్రవాదులకు ఐఈడీ- మనకు ఓటర్ ఐడీ'

Last Updated : Apr 23, 2019, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details