జాతీయ అర్హత పరీక్ష (నీట్)కు సన్నద్దమవుతున్న ముగ్గురు విద్యార్ధులు 24 గంటల్లో ఆత్మహత్యకు పాల్పడడం తమిళనాడులో తీవ్ర విషాదం నింపింది. ధర్మపురి, నమక్కల్, మదురై ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులు శనివారం తమ ఇళ్లలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరంతా 19 నుంచి 21 ఏళ్ల వయసు వారే. వారిలో ఒక యువతి కూడా ఉంది.
నీట్ పరీక్షల ఒత్తిడే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అని పోలీసులు భావిస్తున్నారు. నీట్ రద్దు చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తోన్న తమిళనాడు విపక్షాలు.. తాజా ఘటనతో స్వరాన్ని మరింత పెంచాయి.
సంతాపం..
ఈ ఆత్మహత్యలపై విచారం వ్యక్తం చేసిన డీఎంకే అధినేత స్టాలిన్ నీట్ ఒక పరీక్షే కాదన్నారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని సూచించారు.