తెలంగాణ

telangana

'ప్రణబ్​ ఆరోగ్యంలో మార్పులేదు- వెంటిలేటర్​పైనే చికిత్స'

By

Published : Aug 25, 2020, 3:32 PM IST

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆర్మీ ఆస్పత్రి తెలిపింది. ఆరోగ్య సూచీలన్నీ నిలకడగానే ఉన్నట్లు స్పష్టం చేసింది. వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.

There is no change in the medical condition of former president Pranab Mukherjee
'ప్రణబ్​ ఆరోగ్యంలో మార్పులేదు- వెంటిలెటర్​పైనే చికిత్స'

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆయనకు చికిత్స అందిస్తున్న దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వెల్లడించింది. ప్రణబ్​కు వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఆయన ఆరోగ్య సూచీలన్నీ స్థిరంగానే ఉన్నట్లు స్పష్టం చేసింది.

ముఖర్జీ ఆగస్టు 10న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. అదే రోజు ఆయనకు మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స నిర్వహించారు. అంతకుముందే ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.

ABOUT THE AUTHOR

...view details