తెలంగాణ

telangana

By

Published : May 15, 2020, 11:26 PM IST

ETV Bharat / bharat

మూడో విడత ప్యాకేజీపై ఉపరాష్ట్రపతి, హోం మంత్రి హర్షం

కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదే క్రమంలో.. వ్యవసాయ ఉత్పత్తుల అంతర్​ ర్రాష్ట్ర అమ్మకాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు ఉపరాష్ట్రపతి. రైతుల సంక్షేమంతోనే దేశం అభివృద్ధి దాగుందని మోదీ ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్​ షా పేర్కొన్నారు.

The Vice President and Home Minister applauded the decision of the Center on agricultural infrastructure under the third installment package.
మూడో విడత ప్యాకేజీపై ఉపరాష్ట్రపతి, హోం మంత్రి హర్షం

ఆత్మ నిర్భర్​ భారత్​ పథకం మూడో విడత ప్యాకేజీలో భాగంగా.. వ్యవసాయ ఉత్పత్తుల అంతర్​ రాష్ట్ర అమ్మకాలపై ఉన్న అడ్డంకులను తొలిగించాలని ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ ప్రకటన ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూర్చినట్లైందని పేర్కొన్నారు.

ఉపరాష్ట్రపతి ట్వీట్​

రైతుల సంక్షేమంతోనే దేశ అభివృద్ధి దాగుందని మోదీ ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. రైతులకు లబ్ది చేకూర్చి, దేశాన్ని స్వయం సమృద్ధివైపు నడిపించేందుకు మోదీ దూరదృష్టితో ఆలోచిస్తున్నారని తెలిపారు. శుక్రవారం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో.. రైతులకు లబ్ది చేకూర్చడమే కాకుండా వారికి ఆదాయాన్ని పెంచుతుందని భాజపా నేత జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

జేపీ నడ్డా ట్వీట్​

క్షమాపణ చెప్పాల్సిందే..

రైతుల పట్ల మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్​ ఆరోపించింది. కరోనా ఆర్థిక ప్యాకేజీలో రైతులను బేఖాతరు చేసినందుకు ప్రధాని, ఆర్థిక మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా. ఇప్పటికే మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ జుమ్లా ప్యాకేజీ(ఉత్తుత్తి ప్యాకేజీ)గా తేలిపోయిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details