తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: అమెరికాయానానికి విరామం! - భారత విద్యార్థులకు యూఎస్ వీసా నిలుపుదల

అమెరికా వెళ్లాలన్న భారత విద్యార్థుల ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. కొవిడ్‌ 19 తీవ్రతతో అగ్రరాజ్యం ఆరోగ్య అత్యయికస్థితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి వచ్చే వారికి వీసాలు జారీ చేయకూడదని అమెరికా నిర్ణయించింది. ఇమిగ్రెంట్‌, నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసాల జారీ ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి.

The US has decided not to issue visas to those coming from India.
కరోనా ఎఫెక్ట్​: అమెరికాయానానికి విరామం!

By

Published : Mar 15, 2020, 5:53 AM IST

భారత విద్యార్థుల అమెరికా ఆశలపై కరోనా వైరస్‌ తాత్కాలికంగా నీళ్లు చిమ్మింది. కొవిడ్‌ 19 తీవ్రతతో అగ్రరాజ్యం ఆరోగ్య అత్యయికస్థితి ప్రకటించింది. విశ్వవిద్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. కొన్నింటికి సెమిస్టర్‌ సెలవులు ప్రకటించారు. భారతదేశం నుంచి వచ్చే వారికి వీసాలు జారీ చేయకూడదని అమెరికా నిర్ణయించింది. ఇమిగ్రెంట్‌, నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసాల జారీ ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో వీసాల కోసం తీసుకున్న అన్ని అపాయింట్‌మెంట్లను రద్దు చేశారు. ఆ ప్రక్రియ మళ్లీ ఎప్పుడన్నది తరువాత ప్రకటిస్తామని తెలిపారు. కేవలం అత్యవసర, దౌత్యపరమైన వీసాలను మాత్రమే జారీ చేయాలని భారతదేశంలోని తమ కార్యాలయాలకు అమెరికా స్పష్టం చేసింది.

కరోనా ఎఫెక్ట్​: అమెరికాయానానికి విరామం!

ఆగస్టుకు వెళ్లే విద్యార్థులపై ప్రభావం

అమెరికాలో ఆగస్టు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఆ సీజన్‌లో అక్కడి కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులు ముందు సంవత్సరం డిసెంబరు నుంచి విశ్వవిద్యాలయాల ఎంపిక ప్రారంభిస్తారు. కళాశాల ఎంపిక తరువాత ఐ-20లను తెప్పించుకోవాలి. వర్సిటీల మూసివేతతో విద్యార్థులకు ఐ-20లు రావటంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఐ-20 వచ్చిన విద్యార్థులకు.. వీసా ఇంటర్వ్యూలు ఆలస్యం కానున్నాయి. వీసా జారీకి అనుమతించిన సమయంలో ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ పొందటం కూడా సమస్య అవుతుందేమోనన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తం అవుతోంది.

వసతిగృహాల మూసివేత

పలు వర్సిటీలు వసతిగృహాలనూ మూసివేశాయి. సహజంగా డిగ్రీ చదివే వారిలో అధిక శాతం మంది వసతి గృహాల్లో ఉంటారు. మాస్టర్స్‌ చేసే వారు బయట రూములు తీసుకుని ఉంటుంటారు. వసతి గృహాలు మూసి వేయటంతో ఇప్పటికే అక్కడ చదువుతున్న పలువురు భారతీయ విద్యార్థులు బంధువుల ఇళ్లకు వెళుతున్నారు. మరికొందరు ఆశ్రయం ఇచ్చే వారి కోసం వెతుకుతున్నారు. వచ్చే వారం నుంచి ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు కొన్ని వర్సిటీలు నిర్ణయించాయని తెలిసింది.

రోజుకు 5 వేల వీసాలు

భారతదేశం నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రతి రోజూ 5 వేల మంది వరకు ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. అందులో విద్యార్థుల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో ఉంటారు. ఒక్క హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం పరిధిలో రోజుకు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది వీసా ఇంటర్వ్యూలకు వస్తుంటారు. దిల్లీలోని రాయబార కార్యాలయం, ముంబయి, చెన్నై, కోల్‌కతా కాన్సులేట్‌ కార్యాలయాల్లోనూ కాస్తంత అటూఇటుగా వెయ్యి మంది చొప్పున ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. వీసా ఇంటర్వ్యూ కోసం సాధారణంగా నెల ముందు నుంచి అపాయింట్‌మెంట్‌ తీసుకుంటారు. ప్రస్తుతం ఇవన్నీ పెండింగ్‌లో పడనున్నాయి.

ఇదీ చూడండి:లక్షా 50 వేలు దాటిన కరోనా కేసులు...

ABOUT THE AUTHOR

...view details