తెలంగాణ

telangana

'మధ్యప్రదేశ్​ బలపరీక్షపై గవర్నర్​ నిర్ణయం సరైనదే'

By

Published : Apr 13, 2020, 12:22 PM IST

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోవాలని గవర్నర్​ ఆదేశించడాన్ని సవాల్​ చేసిన పిటిషన్​పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్​ రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది.

Supreme Court
బలపరీక్షపై పిటిషన్​ తిరస్కరణ

మధ్యప్రదేశ్​లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్​ పార్టీకి సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. కాంగ్రెస్​ సర్కారును బలం నిరూపించుకోవాలని గవర్నర్​ ఆదేశించటాన్ని సవాల్​ చేస్తూ.. మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీం తీర్పు వెలువరించింది. బలపరీక్షకు గవర్నర్​ ఆదేశించడాన్ని సమర్థించింది.

ఈ పిటిషన్​పై జస్టిస్​ చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం.. 68 పేజీల వివరణాత్మక తీర్పు వెలువరించింది. రాజ్యాంగం, గవర్నర్​ విచక్షణాధికారాలను తీర్పులో పేర్కొంది ధర్మాసనం. సరైన కారణం ఉన్నప్పుడు గవర్నర్​.. బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రిని ఆదేశించడంలో ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టం చేసింది. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా గవర్నర్​ ఈ అధికారాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

ఇదీ చూడండి:కరోనా కాలంలో బడుగులకు బతుకు భయం

ABOUT THE AUTHOR

...view details