అయ్యప్ప భక్తులు శబరిమల యాత్ర కోసం తమ పేర్లు ముందుగానే నమోదు చేసుకునేందుకు ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైంది.
భక్తులు www.sabarimalaonline.org లో లాగిన్ అయ్యి వారి పేరు, వయస్సు, చిరునామా, ఫొటో, స్కాన్ చేసిన గుర్తింపు కార్డులు, మొబైల్ నంబర్ల వివరాలు నింపి, బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ శబరిమల యాత్ర మారారూట్టం నుంచి సన్నిధానం నందపంతల్ మీదుగా శరణకుటి వరకు సంప్రదాయ మార్గంలో సాగుతుంది.
ప్రతి ఒక్కరు వేరువేరుగా..
ఒకే కుటుంబమైనా, స్నేహితులైనా యాత్రికులందరూ విడిగా బుక్ చేసుకోవాల్సిందే. వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాలెండర్లో తేదీ, సమయం ఎంపిక చేసుకోవాలి. ఐదేళ్ల లోపున్న పిల్లలకు బుకింగ్లు అవసరం లేదు. కానీ, బడిపిల్లలు తమ స్కూల్ ఐడీ కార్డు జత చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.
ప్రతి సేవకు ప్రత్యేక కూపన్
ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతి సేవకు ప్రత్యేక కూపన్ అందుబాటులో ఉంది. బుకింగ్ పూర్తి చేశాక, యాత్రా సమయం, తేదీని సేవ్ చేసి.. వర్చువల్ క్యూ (స్వామి దర్శన క్యూ) కూపన్ ప్రింట్ చేసుకోవాలి(ధ్రువీకరణకు). యాత్రకు వెళ్లేటప్పుడు ఈ కాగితాలతో పాటు, ఫొటో, గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
స్వామి దర్శనానికి వెళ్లే ముందు పంపా గణపతి ఆలయంలోని ఆంజనేయ మండపం వద్ద పోలీసు కౌంటర్లో ఈ ధ్రువీకరణ కాగితాలను చూపించాలి. ఆపై నమోదు చేసుకున్న సమయానికి గణపతి ఆలయం వద్ద దర్శనం చేసుకోవచ్చు. వర్చుల్ క్యూ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
మరింత సమాచారం కోసం శబరిమల అధికారిక వెబ్సైట్ www.sabarimalaonline.org ను సంప్రదించవచ్చు లేదా 7025800100 నంబరుకు ఫోన్ చేసి వివరాలుు పొందవచ్చు.
ఇదీ చూడండి:ఉగ్రసింహం 'బాగ్దాదీ' కుక్కచావు..!