తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా మహమ్మారికి కుష్ఠు టీకా పనిచేస్తోంది' - రివర్స్ ఇంజినీరింగ్

కరోనా మహమ్మారిని సమర్థవంతంగా నియంత్రించేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్​.చంద్రశేఖర్​ తెలిపారు. ఈ అంటువ్యాధిని నిర్మూలించే వ్యాక్సిన్ రూపొందించేందుకు రివర్స్ ఇంజినీరింగ్ చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కుష్ఠు వ్యాధిని నయంచేసే టీకా... కరోనాపై కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

The leprosy vaccine is working to cure the corona
కుష్ఠు టీకా పనిచేస్తోంది

By

Published : May 12, 2020, 7:14 AM IST

కొవిడ్‌-19ను నియంత్రించేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. వైరస్‌పై సమర్థంగా పని చేస్తున్నాయని గుర్తించిన ఔషధాలను ఇక్కడే తయారు చేయడంతో పాటు, వైరస్‌ శరీరంలోకి చేరినా నిరోధించే వ్యాక్సిన్‌ తయారీపై దృష్టి సారించామన్నారు. ఇందుకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) ప్రయోగశాలలు పరిశోధనలు చేస్తున్నాయని, అందులో ఐఐసీటీ ఒకటని చెప్పారు. కొవిడ్‌-19 పరీక్షలు, ప్రస్తుతమున్న సవాళ్లు, ఔషధాల తయారీ పురోగతిపై ఆయన రాజ్యసభ టీవీతో మాట్లాడారు.

రివర్స్‌ ఇంజినీరింగ్‌లో...

కొవిడ్‌-19 కారక కరోనా వైరస్‌ వచ్చి నాలుగు నెలలు దాటింది. ఇంతత్వరగా మందులు, వ్యాక్సిన్లు కనుగొనడం కష్టసాధ్యం. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయని గుర్తించిన ఔషధాల్లో కొన్నింటిని రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతిలో ఐఐసీటీలో తయారుచేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా ఒక కొత్త ఔషధం తయారుచేస్తే, దానికి పేటెంట్‌ ఉన్నప్పటికీ.. వారు చేసిన విధానం(ప్రాసెస్‌)లో కాకుండా మనం మార్చి వేరే విధానంలో చౌక ధరలో దాన్ని తయారు చేస్తున్నాం. జనరిక్‌ మందుల తయారీ రివర్స్‌ ఇంజినీరింగే. ప్రపంచంలో ఎక్కడ ఔషధం కనుగొన్నా, వ్యాక్సిన్‌ తయారు చేసినా భారత్‌లో ఉత్పత్తి కావాల్సిందే. భారత్‌లో వేర్వేరు దేశాల ఎఫ్‌డీఏ అనుమతి పొందిన ఉత్పత్తి ప్లాంట్లు పెద్ద సంఖ్యలో ఉండటం మనకు కలిసొచ్చే అవకాశం.

ఏపీఐ వరకే...

సీఎస్‌ఐఆర్‌కు చెందిన ప్రయోగశాల గుజరాత్‌కు చెందిన ఒక కంపెనీతో కలిసి కొన్నేళ్ల క్రితం కుష్ఠు నివారణకు తయారుచేసిన ఎండబ్ల్యూ వ్యాక్సిన్‌ కొవిడ్‌పై పనిచేస్తున్నట్లు గుర్తించారు. నాలుగు ఆసుపత్రుల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న ఇతర ఔషధాలకు సంబంధించి ఐఐసీటీలో యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ (ఏపీఐ) సాంకేతికతను అభివృద్ధి చేశాం. ఏపీఐ అంటే రోగాన్ని తగ్గించే అసలైన మందు. కానీ నేరుగా దీన్ని తీసుకోలేం. దీనికి కొంచెం రుచి, రంగు కోసం ఇతర రసాయనాలు కలుపుతారు. మందు బిళ్లలు, సిరప్‌ రూపంలో ఉంటుంది. ఏపీఐ సాంకేతికతను పరిశ్రమలకు బదలాయించాక అక్కడ ఇవన్నీ చేస్తారు. చైనా, జపాన్‌లో ప్రయోగించిన ఫావిపిరవిర్‌ ఏపీఐని ఐఐసీటీ శాస్త్రవేత్తలు నాలుగు వారాల్లో రాత్రింబవళ్లు శ్రమించి అభివృద్ధి చేశారు. 99.99 శాతం స్వచ్ఛత(ఫ్యూరిటీ) వచ్చింది. ఒక దేశీయ ఫార్మా కంపెనీకి సాంకేతికత బదిలీ చేశాం. వారు కిలోల్లో ఉత్పత్తి చేశారు. డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతి దశలో ఉంది.

ఇదీ చూడండి:'సైన్స్ ఫిక్షన్​ సీన్​ను తలపిస్తున్న విమాన ప్రయాణం'

ABOUT THE AUTHOR

...view details