తెలంగాణ

telangana

ఓటరు నాడిని పట్టగలిగిన ఎగ్జిట్​ పోల్స్​

By

Published : Feb 12, 2020, 9:28 AM IST

Updated : Mar 1, 2020, 1:39 AM IST

దిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలపై వేర్వేరు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్​ పోల్స్​ అన్నీ ఆప్​నే విజయం వరిస్తుందని తేల్చి చెప్పేశాయి. ఇంతకీ ఏ సర్వే ఏం చెప్పిందో తెలుసుకుందామా?

the exact results came at delhi assembly elections which has already said in exit polls
ఎగ్జిట్​ పోల్స్​కు చేరువగా దిల్లీ ఫలితాలు

దిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్​ విజయంతో ఆప్​ మళ్లీ అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. ఈ ఎన్నికలపై వేర్వేరు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్​పోల్స్​ అన్నీ అరవింద్​ కేజ్రీవాల్​ గెలుపు ఖాయమని తేల్చి చెప్పేశాయి. ఇండియా టుడే- యాక్సిస్​, ఏబీసీ - సీ ఓటర్​, టీవీ9- భారత్​ వర్ష్​- సిసిరో వేసిన అంచనాలు ఆప్​, భాజపా తుది ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఇండియా టుడే- యాక్సిస్​ సర్వే ఆప్​నకు 59-68 మధ్య వస్తాయని, భాజపా 2-11 స్థానాల మధ్య నిలుస్తుందని అంచనా వేసింది. 2019 లోక్​సభ ఎన్నికలు మొదలుకొని ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ సంస్థ ఎగ్జిట్​పోల్స్​ ఎంచనాలు, వాస్తవ ఫలితాలు ఒకటే అయ్యాయి.

వివిధ వార్తాసంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూస్తే..

ఎగ్జిట్​ పోల్స్ వ్యత్యాసం
Last Updated : Mar 1, 2020, 1:39 AM IST

ABOUT THE AUTHOR

...view details