తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతు బిల్లులకు నిరసనగా కాంగ్రెస్​ దేశవ్యాప్త ఆందోళనలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్​ పార్టీ. సంబంధిత కార్యాచరణను ప్రకటించింది.

By

Published : Sep 24, 2020, 6:59 PM IST

The Congress party called for nationwide agitation
రైతు బిల్లులకు నిరసనగా కాంగ్రెస్​ దేశవ్యాప్త ఆందోళనలు

పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులపై విపక్షాలు, రైతు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పంజాబ్​, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో వీటిని నిరసిస్తూ ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్​ పార్టీ. కేంద్రం తీసుకొచ్చిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ఆందోళనలకు సంబంధించి కార్యాచరణ ప్రకటించింది.

  • సెప్టెంబర్​ 26 - స్పీక్​ అప్​ ఫర్​ ఫార్మర్​ పేరుతో ఆన్​లైన్​ క్యాంపెయిన్​
  • సెప్టెంబర్​ 28 - రాజ్​ఘాట్​ నుంచి రాజ్​భవన్​ వరకు పాదయాత్ర
  • అక్టోబర్​ 2 - అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాని దిష్టిబొమ్మ దహనం
  • అక్టోబర్​ 2 నుంచి అక్టోబర్​ 31 వరకు సంతకాల సేకరణ
  • అక్టోబర్​ 10 - ప్రదేశ్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో రైతు సమ్మేళనాలు

ఇదీ చూడండి:'రైతుల తర్వాత ఈసారి కార్మికులపై దోపిడి'

ABOUT THE AUTHOR

...view details