తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పబ్​జీ' వద్దంటే.. పురుగుల మందు తాగేశాడు! - pubg effect in Chikkaballapura

పబ్​జీ వ్యసనం కర్ణాటకలోని మరో బాలుడి మృతికి కారణమైంది. పబ్​జీ ఆడుకోవడానికి ఫోన్​ ఇవ్వనందుకు మనస్తాపానికి గురైన బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

the-boy-committed-suicide-for-not-giving-the-mobile-to-play-pubg-in-karnataka-chikkaballapura
'పబ్​జీ' వద్దంనందుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య

By

Published : Dec 24, 2019, 4:13 PM IST

పబ్​జీ మోజులోపడి మరో బాలుడు చేతులారా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పబ్​జీ ఆడుకోవడానికి మొబైల్​ ఇవ్వలేదని కర్ణాటక చిక్కబల్లాపుర్​కు చెందిన యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

'పబ్​జీ' వద్దన్నందుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య

చిక్కబల్లాపుర్​ జిల్లాలోని చేలూరు తాలుకాకు చెందిన యశ్వంత్​ పబ్​జీ ఆడుకోవడానికి తన అక్క అఖిలను ఫోన్​ ఇవ్వమన్నాడు. అధికంగా మొబైల్​ ఫోన్​లు వాడడం ప్రమాదకరమని హెచ్చరించింది సోదరి. తాను పబ్​జీ ఆడుకోకుండా చేసినందుకు కోపంతో ఊగిపోయాడు యశ్వంత్​. క్షణికావేశంలో మొక్కలకు వాడే పురుగుల మందు తాగేశాడు.

కాసేపటికి తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రిలో చేర్చారు. కానీ, మార్గ మధ్యంలోనే యశ్వంత్​ చనిపోయాడని వైద్యులు తెలిపేసరికి బోరున విలపించారు కుటుంబ సభ్యులు.

ఇదీ చదవండి:'ప్రణాళిక ప్రకారమే 'పౌర' నిరసనల్లో హింస!'

ABOUT THE AUTHOR

...view details