పబ్జీ మోజులోపడి మరో బాలుడు చేతులారా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పబ్జీ ఆడుకోవడానికి మొబైల్ ఇవ్వలేదని కర్ణాటక చిక్కబల్లాపుర్కు చెందిన యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
చిక్కబల్లాపుర్ జిల్లాలోని చేలూరు తాలుకాకు చెందిన యశ్వంత్ పబ్జీ ఆడుకోవడానికి తన అక్క అఖిలను ఫోన్ ఇవ్వమన్నాడు. అధికంగా మొబైల్ ఫోన్లు వాడడం ప్రమాదకరమని హెచ్చరించింది సోదరి. తాను పబ్జీ ఆడుకోకుండా చేసినందుకు కోపంతో ఊగిపోయాడు యశ్వంత్. క్షణికావేశంలో మొక్కలకు వాడే పురుగుల మందు తాగేశాడు.