తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2020, 12:47 PM IST

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రవాది హతం-  ఇద్దరు అరెస్ట్​

జమ్ముకశ్మీర్​లో భద్రత బలగాలు ఉగ్రవాదిని హతమార్చాయి. బుడ్గాంలో నిర్బంధ తనిఖీలు చేస్తున్న సైన్యంపై కాల్పులకు తెగబడ్డ ముష్కరుడిని మట్టుబెట్టాయి. మరోవైపు కుప్వారా జిల్లాలో జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను అరెస్టు చేసింది సైన్యం.

Terrorist killed by security forces in J-K's Budgam
కశ్మీర్​లో ఓ ఉగ్రవాది హతం- మరో ఇద్దరు అరెస్ట్​

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. బుడ్గాం ప్రాంతంలోని కవూసా ఖలీసాలో ఓ ముష్కరుడిని సైన్యం మట్టుబెట్టింది. నిర్బంధ తనిఖీలు చేపట్టిన సైన్యంపై కాల్పులు జరిపిన ముష్కరుడు.. ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. సుక్​నాగ్​ నాలాలో మరో ఉగ్రవాది మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.

అరెస్ట్​

కుప్వారా జిల్లా డ్రగ్​ముల్లా ప్రాంతంలో రహదారిపై తనిఖీలు నిర్వహించిన బలగాలు.. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను అరెస్టు చేశాయి. వారి నుంచి ఓ తుపాకీ, రెండు గ్రెనేడ్​లు, రూ.7 లక్షల నగదును జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

పాక్​ దుశ్చర్య..

మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్​. పుంఛ్​ జిల్లాలోని ముకుట్​ సెక్టార్​ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది పాక్​ సైన్యం. ఈ దుశ్చర్యను సమర్థంగా తిప్పికొట్టాయి భారత బలగాలు.

ఇదీ చూడండి:'వినోబా భావే, వివేకానందుడు నేర్పిన పాఠాలెన్నో'

ABOUT THE AUTHOR

...view details