తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్య దిల్లీలో ఆలయం ధ్వంసంతో ఉద్రిక్తత

మధ్య దిల్లీలోని హౌజ్​ కాజీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆలయం ధ్వంసమయింది. భారీ సంఖ్యలో వీధుల్లోకి చేరుకున్న ప్రజలు నిరసనలు చేపట్టారు.

By

Published : Jul 1, 2019, 9:54 PM IST

రాజధానిలో ఉద్రిక్తత

రాజధానిలో ఉద్రిక్తత

దేశ రాజధాని దిల్లీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హౌజ్​ కాజీ ప్రాంతంలోని ఓ పార్కింగ్​ స్థలంపై మొదలైన గొడవలో.. స్థానిక ఆలయం ధ్వంసమయింది. ఫలితంగా పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు ఆలయ ధ్వంసానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.

ఈ ఘటనపై స్పందించిన మధ్య దిల్లీ డిప్యూటీ కమిషనర్​ మణ్​దీప్​ సింగ్​.. ప్రజలను సంయమనం పాటించాలని కోరారు.

డీసీపీ ట్వీట్

"హౌజ్​ కాజీలో పార్కింగ్​ విషయంలో జరిగిన గొడవ తీవ్రమయింది. రెండు మతాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మేం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అందరి మనోభావాలను గౌరవమిస్తూ చర్యలు చేపడతాం. పరిస్థితులు చక్కబడే వరకూ ప్రజలు సహకరించాలి."

- మణ్​దీప్​ సింగ్​, మధ్య దిల్లీ డీసీపీ

పార్కింగ్​ ప్రాంతంలో ఓ వ్యక్తి తాగి రావటంపై గొడవ మొదలైందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి. గొడవ అనంతరం కొంతమంది ఆలయంపై దాడి చేయటం వల్ల ఘర్షణలకు దారి తీసింది.

ఇదీ చూడండి: లోయలో పడ్డ పాఠశాల బస్సు- నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details