తెలంగాణ

telangana

'రూట్ తలా': కండక్టర్​పై విద్యార్థుల దాడి

By

Published : Jul 31, 2019, 2:40 PM IST

Updated : Jul 31, 2019, 2:46 PM IST

తమిళనాడులోని మధురైలో బస్సు కండక్టర్​పై కత్తితో దాడి చేశారు ఇద్దరు విద్యార్థులు. కారణమేంటో తెలుసా... టికెట్​ తీసుకోమని కోరడమే. బాధితుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు.

'రూట్ తలా': కండక్టర్​పై విద్యార్థుల దాడి

పాలిటెక్నిక్ చదివే విద్యార్థుల వయసెంత ఉంటుందంటారు... ఓ 17 నుంచి 19 ఏళ్ల మధ్య కదూ. ఆ వయసులోనే గ్యాంగ్​స్టర్లుగా మారి దాడులకు పాల్పడితే... కత్తులతో చంపేందుకు యత్నిస్తే... ఒకసారి ఊహించుకోండి... ఎటుపోతోందీ సమాజం అని వైరాగ్యం కలుగుతోంది కదూ. తమిళనాడులో అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది.

స్థానిక పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పెరియార్ స్టాపు వద్ద బస్సెక్కారు. కండక్టర్ టికెట్లు తీసుకోమని కోరారు. కానీ.. తీసుకునేందుకు మొండికేసిన వారు అతడితో వాదనకు దిగారు. వివాదం ముదిరి దాడికి దారితీసింది. తమ బ్యాగులోని కత్తితో విద్యార్థులు కండక్టర్​పై విరుచుకుపడి అక్కడినుంచి పరారయ్యారు.

బాధితుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పెరిగిన విద్యార్థుల దాడులు

చెన్నైలో "రూట్ తలా"గా పిలిచే మార్గం.. రౌడీమూకలకు కేంద్రంగా మారింది. విద్యార్థులు తమకు అడ్డు చెప్పిన వారిపై దాడులకు తెగిస్తున్నారు. తాజాగా మధురై విద్యార్థులు సైతం 'రూట్ తలా' మార్గం పట్టారు.

ఇదీ చూడండి: నడిరోడ్డుపై కత్తులతో విద్యార్థుల వీరంగం

Last Updated : Jul 31, 2019, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details