తెలంగాణ

telangana

సచిన్​కు భద్రత కుదింపు.. ఆదిత్య ఠాక్రేకు పెంపు

ప్రముఖుల భద్రతపై మహారాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. క్రికెట్​ దిగ్గజం సచిన్​కు ఇప్పుడున్న ఎక్స్ కేటగిరీ భద్రతను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. శివసేన యువ ఎమ్మెల్యే, యువసేన అధినేత ఆదిత్య ఠాక్రే భద్రతను జెడ్​ కేటగిరీకి పెంచింది. వీరితో పాటు పలువురు భాజపా నేతల భద్రతనూ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

By

Published : Dec 25, 2019, 1:54 PM IST

Published : Dec 25, 2019, 1:54 PM IST

Tendulkar's security downgraded, Aaditya Thackeray's upgraded
సచిన్​కు భద్రత కుదించిన మహారాష్ట్ర ప్రభుత్వం

క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కర్​కు భద్రత కుదిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 90 మంది ప్రముఖుల భద్రతపై సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఈ మేరకు సవరణలు చేసింది. ఆయా వ్యక్తులకు పొంచి ఉన్న ముప్పును ప్రభుత్వం నియమించిన కమిటీ అంచనా వేసి తాజా మార్పులు చేసింది. ఇప్పటివరకు ఎక్స్ కేటగిరీ భద్రత అనుభవిస్తున్న సచిన్​ను.. ఆ కేటగిరీ నుంచి తొలగించింది. అయితే సచిన్​కు పోలీస్ ఎస్కార్ట్ సౌలభ్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

మరోవైపు యువసేన(శివసేన యూత్ విభాగం) అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు భద్రతను పెంచింది ప్రభుత్వం. ఇదివరకు ఉన్న వై ప్లస్ కేటగిరీని మార్చి జెడ్​ కేటగిరీలో చేర్చింది.

ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​కు జెడ్​ ప్లస్ భద్రతను ప్రభుత్వం కొనసాగించనుంది. అజిత్​ పవార్​కు సైతం ఇంతకు ముందు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను మార్చలేదు. సామాజిక కార్యకర్త అన్నా హజారే భద్రత స్థాయిని వై ప్లస్ నుంచి జెడ్​ కేటగిరీకి మార్చినట్లు అధికారులు తెలిపారు.

భాజపా నేతల భద్రత కుదింపు

ఉత్తర్​ప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్​ నాయక్ భద్రతను జెడ్​ ప్లస్ నుంచి ఎక్స్ కేటగిరీకి కుదించింది. భాజపా మాజీ మంత్రులు ఏక్​నాథ్ శిందే, రామ్ శిందేల భద్రత స్థాయిని సైతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫడణవీస్ ప్రభుత్వంలో ఉన్న పలువురు భాజపా మంత్రుల భద్రతనూ త్వరలో తగ్గించనున్నట్లు అధికారులు వెల్లడించడం గమనార్హం.

1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో వాదించిన ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ భద్రతనూ తగ్గించింది. అంతకుముందు జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఆయనను వై కేటగిరీలో చేర్చింది.

ABOUT THE AUTHOR

...view details