తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడుకు ఉగ్ర ముప్పు...తీరప్రాంతం హై అలర్ట్​

తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తీరప్రాంత దళాలను అప్రమత్తం చేశారు అధికారులు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

By

Published : Aug 24, 2019, 9:48 PM IST

Updated : Sep 28, 2019, 3:59 AM IST

తమిళనాడుకు ఉగ్రవాద ముప్పు... తీరప్రాంతం హై అలర్ట్​

తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం అనుమానం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోయంబత్తూరులోని వివిధ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

లష్కర్​-ఏ-తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు కోయంబ్తతూరులో ప్రవేశించారని నిఘా వర్గాలకు శుక్రవారం సమాచారం అందింది. శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా చొరబడ్డారని అధికారులు అనుమానిస్తున్నారు. తీరప్రాంత దళాలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోయంబత్తూరులో హై అలర్ట్​ ప్రకటించారు.

రైల్వే స్టేషన్లు, బస్​ స్టేషన్లు, చర్చి, మసీదులు వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడే అవకాశాలున్నాయని, ఆ ప్రదేశాల్లో భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:'70 ఏళ్లలో కానిది 70 రోజుల్లో పూర్తి చేశాం'

Last Updated : Sep 28, 2019, 3:59 AM IST

ABOUT THE AUTHOR

...view details