అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తమిళనాడు ప్రభుత్వం పలు పథకాలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.12,110 కోట్లను కేటాయిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో వెల్లడించారు.
ఈ పథకం వెంటనే అమలులోకి వస్తుందని వెల్లడించారు సీఎం. దీనికి అవసరమైన నిధులను తమ ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుందని తెలిపారు. దీంతో సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న దాదాపు 16.43లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. మరిన్ని నూతన సంక్షేమ పథకాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు పళనిస్వామి.
జల్లికట్టు నిరసన కేసులు వాపసు