తెలంగాణ

telangana

By

Published : Feb 23, 2020, 5:23 AM IST

Updated : Mar 2, 2020, 6:17 AM IST

ETV Bharat / bharat

'పీఓకేను తిరిగి పొందడమే తదుపరి లక్ష్యం'

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీఓకే)ను తిరిగి వెనక్కి తీసుకోవడమే భారత్​ తదుపరి లక్ష్యమని భాజపా ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా రద్దుతో 'అఖండ భారత్​' సాధన దిశగా తొలి అడుగు పడినట్లు ఆయన చెప్పారు.

Taking back PoK is next step towards achieving Akhand Bharat'
పాక్​ ఆక్రమిత కశ్మీర్​ స్వాధీనమే తదుపరి లక్ష్యం

రాజ్యాంగంలో ఆర్టికల్​ 370 రద్దు 'అఖండ భారత్​' సాధనలో తొలి అడుగన్నారు భాజపా ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. పాక్​ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)ను వెనక్కి తీసుకోవడమే తదుపరి లక్షమని స్పష్టం చేశారు.

దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో జరిగిన 'ఛాత్ర సంసద్​' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలు తెలిపారు.

అఖండ భారత్ లక్ష్యాన్ని ఎప్పటి వరకు సాధిస్తామని ఒకరు ఆయన్ను ప్రశ్నించగా.. అది దశల వారీగా జరుగుతుందని సమాధానమిచ్చారు.

ఇదీ చూడండి:'మూడున్నర ఏళ్లలో అయోధ్య రామాలయం నిర్మిస్తాం!'

Last Updated : Mar 2, 2020, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details